పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రీ ఎంట్రీ సినిమా వకిల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాకి " ఓ మై గాడ్" , " ఎంసీఏ " సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకి దిల్ రాజ్, బోనీ కపూర్ లు కలిసి నిర్మాతలుగా వహిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన పింక్ సినిమాకి రీమేక్  గా తెరకెక్కుతున్నరు అని ఆ విషయం తెలిసిందే కదా. 

 

ఇక ఈ సినిమాని మే 15 న రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దాని ప్రకారమే షూటింగ్ లు అన్నీ కూడా త్వరత్వరగా పూర్తి చేసుకున్నారు.  కానీ ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి వల్ల షూటింగులకు బ్రేక్ పడింది. లాక్ డౌన్ కారణంగా మే నెలలో థియేటర్లు ఓపెన్ చేసే అవకాశాలు అసలు కనబడటంలేదు. అంతేకాకుండా షూటింగ్ కూడా కాస్త పెండింగ్ ఉండడంతో ఇప్పట్లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించటం లేదు. 


ఇక తాజా సమాచారం మేరకు వారికి ఈ సినిమాను ఆగస్టు 15 న రిలీజ్ చేయాలని దిల్ రాజు ఆలోచిస్తున్నాడట.  దీనితో పాటు మిగిలిన భాగం షూటింగ్ పూర్తి అవడానికి నెల రోజుల సమయం పడుతుందని చిత్ర యూనిట్ అనుకుంటుంది. ఇందుకుగాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎనిమిది రోజులు డేట్లు కేటాయిస్తే చాలు షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. దీనితోపాటు సోషల్ మెసేజ్ తో వస్తున్న సినిమా కూడా కావటంతో ఆగస్టు 15 న రిలీజ్ చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ని మళ్ళీ స్క్రీన్ పై చూడడానికి కళ్ళు కాయలు కాసేల ఎదురు చూస్తున్నారు ఫాన్స్.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: