అతి త్వరలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి 27వ సినిమాని గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. వాస్తవానికి తన తదుపరి సినిమాని మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ చేయాల్సి ఉండగా, ఆ సినిమా స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధం కాకపోవడంతో ఆయన పరశురామ్ కథకు మొగ్గు చూపారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పలు కమర్షియల్ హంగులతో తెరకెక్కనున్న ఈ సినిమాని మహేష్ బాబు జీఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి దర్శకుడు కొరటాల శివ సంయుక్తంగా నిర్మించనున్నట్లు చెప్తున్నారు. 

 

గోపీ సుందర్ సంగీతాన్ని అందించనున్న ఈ సినిమాకు సంబందించిన ఒక వార్త ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. అదేమిటంటే, దర్శకడు పరశురామ్ ఈ సినిమాని తెలుగు సహా పలు ఇతర భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో తీయాలని ఆలోచిస్తున్నారని, అలానే మహేష్ ప్రక్కన హీరోయిన్ గా సాహో భామ శ్రద్ధ కపూర్ ని తీసుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. స్వతహాగా సూపర్ స్టార్ కు పెద్ద ఫ్యాన్ అయిన శ్రద్ధ, ఈ సినిమా కథ కనుక వింటే తప్పకుండా ఒప్పుకుంటారని, సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎంతో మంచి ప్రాధాన్యం ఉందని, అదీకాక ఆమెను తీసుకుంటే అటు నార్త్ లో ఈ సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నట్లు టాక్. అయితే శ్రద్ధ ని ఈ సినిమాలో తీసుకోవడం పై కొందరు మహేష్ ఫ్యాన్స్  పరశురామ్ నిర్ణయాన్ని విబేధిస్తున్నట్లు సమాచారం. 

 

ఎందుకంటే గతంలో ప్రభాస్ సరసన ఆమె నటించిన సాహో సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడం ఒక కారణం అయితే, ఆమెను టాలీవుడ్ కి తీసుకురావాలంటే పారితోషికం కూడా భారీగా ముట్టజెప్పాల్సి ఉంటుందని, కావున ఇదంతా కాకుండా మన టాలీవుడ్ లోనే మంచి పేరున్న హీరోయిన్ ని తీసుకంటే బెటర్ అని వారు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. మరి ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా చర్చనీయాంశం గా మారిన మహేష్ బాబు 27వ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారో, ఎప్పుడు మొదలవుతుందో, ఎటువంటి కథ, వంటి తదితర విషయాలన్నీ తెలియాలంటే ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: