ప్రభాస్ టాలీవుడ్ కి డార్లింగ్. ఆ మాటకు వస్తే తనకు పరిచయం ఉన్న వారితో పాటు తెర పరిచయం ఉన్న వారందరికీ స్వీట్ డార్లింగ్. తన సినిమాలు తన గొడవ తప్ప దేన్నీ పట్టించుకోడు. ఇక ఆపద అంటే సహాయానికి ముందుంటాడు.

 

అందుకే కరోనా విపత్తు వేళ ప్రభుత్వాలకు తన వంతుగా అతి పెద్ద సాయమే చేసి రాజుని అనిపించుకున్నాడు. ఇక ప్రభాస్ ఏ ముహూర్తాన బాహుబలి మూవీ వన్, టూ చేశాడో కానీ ఆయన ఇమేజ్ ఇపుడు బాలీవుడ్ ని దాటేసింది. ప్రభాస్ చేసే పాన్ ఇండియా మూవీయే చేయాలన్నది ముద్ర పడిపోయింది.

 

సాహో మూవీతో ప్రభాస్ తన సత్తా ఏంటో బాలీవుడ్లో ప్రూవ్ చేసుకున్నాడు. టాలీవుడ్లో చీదేసిన ఆ సినిమా  బాలీవుడ్లో మాత్రం 150 కోట్ల పై చిలుకు వసూల్ చేసి కాసుల పంట పండించింది. ఇదిలా ఉండగా ప్రభాస్ ఇపుడు జాన్ మూవీ చేస్తున్న సంగతి విధితమే.

 

ఇది కూడా పాన్ ఇండియా మూవీగానే తీస్తున్నాడు. ఈ మూవీని రాధాక్రిష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్. ఈ మూవీ షూటింగ్ జరుగుతూండగా కరోనా పుణ్యమాని లాక్ డౌన్ ప్రకటించారు.

 

దాంతో అన్నీ క్యాన్సిల్ చేసుకుని ఇంట్లో ఉండాల్సివస్తోంది. నిజానికి జాన్ మూవీని ఈ ఏడాది రెండో భాగంలో అంటే దసరాకు ముందు కానీ తరువాత కానీ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ప్రభాస్ కూడా ఆ తరువాత అశ్వనీదత్ బానర్లో నాగ్ అశ్విన్ డైరెక్షన్లో మూవీ చేసేందుకు రెడీ అయిపోయాడు.

 

ఈ మూవీని ఇదే ఏడాది సెట్స్ మీదకు తీసుకురావాలనుకున్నారు. అయితే కరొనా ఎఫెక్ట్ మూలంగా జాన్ మూవీయే ఈ ఏడాదికి దిక్కు అన్నట్లుగా సీన్ ఉందిట. దాంతో ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీని 2021కి వాయిదా వేశారని తెలుస్తోంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: