ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ సినిమా ఎంతటి సంచలనాలను సృష్ఠించిందో అందరికీ తెలిసందే. ఈ సినిమా తో కన్నడ స్టార్ హీరో యశ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. నిజంగా కన్నడ సినిమా పరిశ్రమ నుంచి ఇలాంటి సినిమా వచ్చి వండర్ ని క్రియోట్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. బాహుబలి ఫ్రాంఛైజీ సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కి పాన్ ఇండియా స్టార్ అన్న క్రేజ్ ఎంతగా వచ్చిందో అంత క్రేజ్ యశ్ కేజీఎఫ్ సినిమాతో దక్కించుకున్నాడు. భారీ కలెక్షన్స్ ని సాధించి ఇండస్ట్రీ రికార్డ్స్ ని క్రియోట్ చేసింది.  

 

ఇక ఈ సినిమా రిలీజైన అన్నీ బాషలలో బ్లాక్ బస్టర్ గా నిలవడం ఎంతో గొప్ప విషయం. అంతేకాదు ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ కి బాలీవుడ్ నుండి అలాగే టాలీవుడ్ నుండి చాలా అఫర్స్ వచ్చాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో రెండు భారీ నిర్మాణ సంస్థలు అడ్వాన్స్ కూడా ఇచ్చి లాక్ చేశాయి. ఇక స్టార్స్ అందరి తో ను ప్రశాంత్ నీల్ కి సినిమా తీయాలన్న ఆసక్తి కూడా ఉంది. కాని ఈ సినిమా కి వచ్చిన క్రేజ్ తో మేకర్స్ మళ్ళీ కేజీఎఫ్ కి కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్ 2 నిర్మించాలని సన్నాహాలు చేశారు. అందులో భాగంగానే మేకర్స్ హీరో యశ్ తో కేజీఎఫ్2 ని నిర్మిస్తున్నారు. ఇక షూటింగ్ పార్ట్ పూర్తయిపోయిన ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 23న విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.

 

అయితే ఇంతలోనే కరోనా వచ్చి పడింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే అక్టోబర్ లో రిలీజ్ అవుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయట. అయినా కన్నడ లో చేసే అవకాశాలున్నాయని మిగతా భాషల్లో మాత్రం ఆ నెలలో రిలీజ్ కి సాధ్యం అవడం కాస్త కష్టమేనని తెలుస్తుంది. ఇక కేజీఎఫ్ 2లో సంజయ్ దత్ అధీరా అన్న విలన్ పాత్ర లో నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ దేశ ప్రధాని పాత్రలో కనిపించనుందట. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇంకో మూడు నాలుగు నెలలు సినిమాలు రిలీజ్ గాని కలెక్షన్స్ పరంగా గాని బాగా ఎఫెక్ట్ పడనుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: