మాస్ మహారాజ రవితేజ కి చాలా కాలం అయింది మంచి హిట్ పడి. అప్పుడెప్పుడో అనిల్ రావిపూడి తెరకెక్కించిన రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ అందుకున్నాడు. అంతే ఆ తర్వాత మళ్ళీ ఇప్పటికి వరకు మళ్ళీ హిట్ అన్న మాట వినలేదు. ఆ సినిమా తర్వాత వచ్చిన నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కో రాజా ..ఇలా వచ్చిన సినిమాలన్ని ఫ్లావతున్నాయి. అయినా మరోసారి తన సత్తా చాటాలన్న కసితో వస్తున్నాడు. ఈ మాస్ రాజా హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం క్రాక్. రవితేజ పోలీస్ ఆఫిసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.

 

ఒంగోలులో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాని గోపీచంద్ మలినేని తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్స్ సినిమా మీద అంచనాలను బాగానే పెంచాయి. ఇంతకముందు రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో డాన్ శ్రీను, బలుపు సినిమాలు వచ్చి మంచి కమర్షియల్ సక్సస్ లను అందుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ సారి ఈ ఇద్దరు హ్యాట్రిక్ హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు. అంతేకాదు ఈ సినిమా హిట్ అన్నది ముగ్గురికీ ఎంతో కీలకం. ఆ ముగ్గురే రవితేజ, గోపీచంద్ మలినేని, శృతి హాసన్.

 

వాస్తవంగా ఈ సినిమాని సమ్మర్ స్పెషల్ గా మే 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలనుకున్నారు. కాని కరోనా కారణంగా పరిస్థితులన్ని మారిపోయాయి. మే 3 వరకు లాక్ డౌన్ పొడగించిన నేపథ్యంలో క్రాక్ సినిమాని జూలై మూడో వారంలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే నెలలో మరో రెండు సినిమాలు రిలీజ్ కి రెడిగా ఉన్నాయి. వాటిలో ఒకటి నేచురల్ స్టార్ నాని నటించిన వి సినిమా కాగా మరో సినిమా రాం పోతినేని నటించిన రెడ్. కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ సినిమా, నాని వి కూడా జూలై లోనే రిలీజ్ అనుకుంటున్నారు. అయితే ఏది ముందు రిలీజ్ కానుందో ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: