నేచురల్ స్టార్ నాని కి వరుసగా ఫ్లాపులు వస్తున్నాయన్న సంగతి తెలిసిందే. విక్రం కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ కూడా ఘోరపరాజయాన్ని చూసింది. వాస్తవంగా ఈ సినిమా మీద నాని చాలా నమ్మకం, ఆశలు పెట్టుకున్నాడు. కాని అవన్ని ఊహించని రీతిలో తారుమారు అయ్యాయి. ఆ షాక్ లోనుంచి కోలుకొని తనకి బాగా ఫేవరేట్ డైరెక్టర్ అయిన మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వి సినిమాని చేశాడు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. 

 

నాని తో పాటు నివేదా థామస్, సుధీర్, అదితీ రావు హైదరీ నటించారు. ఇక వాస్తవంగా ఈ సినిమాని మార్చ్ నెలాఖరులో రిలీజ్ చేయాలనుకున్నారు. కాని ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరినీ బెంబేలెత్తుస్తున్న కరోనా వైరస్ కారణంగా రిలీజ్ చేయలేకపోయారు. లాక్ డౌన్ తో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. రోజు రోజుకి కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను పొడగిస్తున్నారు. ఇక ఇప్పుడు కూడా మరోసారి లాక్ డౌన్ ని మే 7 వరకు పొడిగిస్తునట్లు తెలంగాణా సీ.ఎం.కె.సి.ఆర్ స్పష్టం చేశారు.

 

దాంతో దిల్ రాజు ఈ సినిమాని జూలై నెలలో రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మే 7 న గనక పరిస్థితులు చక్కబడితే ఆ తర్వాత నెలరోజులపాటు అందరు ఎప్పటిలాగే బయటకి యథావిధిగా అన్ని పనులు జరుగుతుంటే జూలై లో రిలీజ్ అని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అన్నీ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని సిద్దంగా ఉంది. అయితే ఇది ఒకరకంగా సాహసమే అని అంటున్నారు.

 

దిల్ రాజు నిజంగా ముందు సినిమా రిలీజ్ చేయాలనుకోవడం పెద్ద రిస్కే అయినా దాన్ని అధిగమించడానికే ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. మరి జూలై లో పక్కా రిలీజ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: