'భాగమతి' వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఈ సినిమా తర్వాత అనుష్క శెట్టి నటించిన సినిమా ఏదీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. వాస్తవంగా ‘భాగమతి’ సినిమా గురించి అందరూ అరుంధతి సినిమా రేంజ్ లో ఊహించుకున్నారు. అనుష్క కూడా అలానే అనుకున్నారు. ఈ సినిమా మరో ఇండస్ట్రీ రికార్డ్ అని ఇంకా చెప్పాలంటే అరుంధతి సినిమాని మంచి హిట్ అవుతుందని అనుకున్నారు. అందుకు కారణం ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్, ట్రైలెర్ వచ్చినప్పుడు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ రావడమే.

 

ఇక నిశబ్ధం సినిమా కోసం కొన్నినెలల పాటు బరువు తగ్గేందుకు అమెరికాకు కూడా వెళ్లారు స్వీటి. ఆ తర్వాతే ‘నిశ్శబ్దం’ సినిమాను కమిటయ్యారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాధవన్ అనుష్క జంటగా నటించారు. అంజలి, సుబ్బరాజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గా, షాలిని పాండే మరో ముఖ్య పాత్రలో నటించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమాని నిర్మించారు. కోన ఫిల్మ్ కార్పరేషన్స్ బ్యానర్ పై కోన వెంకట్ నిర్మించారు. 

 

ఇక ఈ సినిమా వాస్తవంగా ఏప్రిల్ 2న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ దిశగానే ఈ సినిమాకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను కంప్లీట్ చేశారు. అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్ కూడా చాలా వినూత్నంగా చేశారు. అనుష్క సినిమా ఇండస్ట్రీకొచ్చి 15 ఏళ్ళు అయిన సందర్భంగా ఒక స్పెషల్ ఈవెంట్ ని నిశబ్ధం టీం గ్రాండ్ గా నిర్వహించింది. ఈ ఈవెంట్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముకులందరు పాల్గొన్నారు.

 

అంత గ్రాండ్ ఈవెంట్ నిర్వహించాక కరోన కారణంగా లాక్ డౌన్ విధించారు. దాంతో ఈ సినిమా అనుకున్న తేదీన రిలీజ్ కాలేదు. అయితే ఈ సినిమా మాదిరిగానే మిగతా సినిమాలు రిలీజ్ ఆగిపోయినప్పటికి మళ్ళీ కొత్తగా రిలీజ్ డేట్స్ ని లాక్ చేసుకునే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. కాని ఈ విషయంలో కోన టీం మాత్రం నిశబ్ధం గా ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: