డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మళ్ళీ ఫుల్ ఫాం లోకి వచ్చింది ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అన్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత పూరి ఈ సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్నాడు. అంతేకాదు ఈ సినిమా కి ముందు పూరి తో సినిమా చేయడానికి హీరోలెవరు ముందుకు రాలేదని కూడా మాట్లాడుకున్నారు. అలాంటి సమయంలోనే రాం పోతినేని దొరకడం తో ఈ సినిమా తెరకెక్కించి పూరి ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. ఇక ఈ సినిమా సక్సస్ తర్వాత విజయ్ దేవరకొండ తో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నాడు పూరి. అలాగే తన కొడుకు ఆకాష్ పూరి తో రొమాంటిక్ అన్న సినిమాని నిర్మిస్తున్నాడు.

 

ఇక ఇదే సినిమాతో చాలామంది సక్సస్ అందుకొని ఫాం లోకి వచ్చారు. వాళ్ళలో హీరో రాం, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, హీరోయిన్స్ నిధి అగర్వాల్, నభా నటేష్. ముఖ్యంగా హీరోయిన్స్ కి ఈ సినిమాతో ఇస్మార్ట్ బ్యూటీస్ అన్న పేరు వచ్చింది. ఈ సినిమాకి ముందు వీళ్ళని అలా పిలిచిన వాళ్ళు లేరు. నిధి ఇస్మార్ట్ శంకర్ కి ముందు అక్కినేని హీరోలతో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసింది. కాని అవి రెండు ఫ్లాపయ్యాయి. అలాగే నభా నటేష్ కూడా సుధీర్ బాబు తో ఒక సినిమా చేసింది. కాని ఈ ఇద్దరికి సక్సస్ వచ్చింది ఇస్మార్ట్ శంకర్ తోనే. ఇక ఈ సినిమా తర్వాత ఇద్దరు ఇండస్ట్రీలో సెటిలవుతారనుకున్నారు.

 

కాని సీన్ రివర్స్ అయింది. నభా నటేష్ మాస్ మహా రాజ రవితేజ తో డిస్కో రాజ సినిమాలో నటించింది. ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. దాంతో మళ్ళీ నభాకి అవకాశాలు రాలేదు. కాని నిధి మాత్రం గల్లా అశోక్ సరసన నటిస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ఇద్దరు కలిసి ఒకే సినిమాలో ఒకే ఫ్రేం లో కనిపించనున్నారని లేటేస్ట్ న్యూస్. ప్రస్తుతం రవితేజ క్రాక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ సినిమాలోనే ఇస్మార్ట్ బ్యూటీస్ ఇద్దరు కలిసి నటించబోతున్నారని సమాచారం. లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా కి సంబంధించిన అధికారక ప్రకటన రానుందట. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: