టాలీవుడ్ లో రమ్యకృష్ణ కు ఉన్న డిమాండ్ గురించి అందరికి తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత ఆమెతో సినిమా చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆమె కూడా ఎక్కువగా పెద్ద సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అని భావిస్తుంది. మన తెలుగు సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇతర భాషల్లో కూడా ఆడుతూ ఉంటాయి. అది తనకు మంచి అవకాశం అని భావించి ఇప్పుడు ఆమె మరో సినిమాను ఓకే చేసినట్టు సమాచారం. అగ్ర హీరో సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

 

సినిమా ఎవరిదో కాదు సుకుమార్... అల్లు అర్జున్ దర్శకత్వంలో వస్తున్న పుష్పా సినిమా. ఈ సినిమాలో ఆమె నటించడానికి ఆసక్తి చూపిస్తుంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా కథ దాదాపుగా రెడీ గా ఉంది. అయితే కరోనా కారణంగా సినిమా షూటింగ్ ని దర్శకుడు వాయిదా వేసారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఈ సినిమాలో ఆమె కూడా నటించే సూచనలు కనపడుతున్నాయి. ఇక ఈ సినిమా కోసం ఆమె భారీగా డిమాండ్ కూడా చేసింది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం ఈ సినిమా కథ లో చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు. 

 

ఈ సినిమాను వచ్చే ఏడాది ఎలా అయినా సరే ప్రేక్షకుల ముందుకి తీసుకు ని రావాలి అని నిర్మాత దర్శకుడు ఇద్దరూ కూడా భావిస్తున్నారు. ఈ సినిమా లో ఆమె ముఖ్యమంత్రిగా నటించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే సూచనలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటి కూడా నటించే సూచనలు ఉన్నాయని సమాచారం. ఎవరు అనేది ఇంకా తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: