క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం  ఐశ్వర్యారాయ్ తో పాటు  సౌత్ స్టార్స్  తో  ఎపిక్ మల్టీస్టారర్ ని తెరకెక్కిస్తున్నాడు. పొన్నియున్ సెల్వన్ టైటిల్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబందించి  ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ రివీల్ చేశాడు  మణిరత్నం. సౌత్ నుంచి మరో ఎపిక్ మూవీ రెడీ అవుతోంది. క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం లవ్ స్టోరీలే కాకుండా తన మార్క్ భారీ మల్టీస్టారర్ పొన్నియున్ సెల్వన్  తెరకెక్కిస్తున్నాడు .  భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న  ఈ సినిమాకు సంబందించి ఇంట్రస్టింగ్ న్యూస్ చెప్పాడు మణిరత్నం. డిసెంబర్ లో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఓ భారీ షెడ్యూల్ తర్వాత కరోనా బ్రేక్ తీసుకుంది.

 

తమిళ్ రైటర్ కల్కి  క్రుష్ణమూర్తి  రాసిన నవల్ ఆధారంగా తీస్తున్న పొన్నియున్ సెల్వన్  హిస్టారికల్ పీరియాడిక్ డ్రామా స్టోరీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, కార్తి, విక్రమ్,  త్రిష,  జయం రవి, లాంటి స్టార్ కాస్ట్ తో వస్తున్న ఈ సినిమా ఒకటి కాదు రెండు భాగాలుగా తెరకెక్కుతోంది.  ఎట్ ఎ ఫ్లో ఈ సంవత్సరం చివరి వరకూఈ సినిమాని షూట్ చేసి  2 పార్ట్స్ గా రిలీజ్ చేస్తానంటున్నాడు మణిరత్నం.

 

థాయిలాండ్  అడవుల్లో షూటింగ్ స్టార్ట్ చేసి తర్వాత కేరళ అడవుల్లో కూడా షూటింగ్ జరుపుకుంది పొన్నియున్ సెల్వన్ టీమ్.  నిజానికి పొన్నియున్ సెల్వన్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ . అయితే చాలా రోజుల నుంచి  తెరకెక్కిద్దామనుకుంటున్న ఈ సినిమా రకరకాల కారణాలతో పెండింగ్ తో పడుతోంది. ఫైనల్లీ లాస్ట్ ఇయర్  మొదలైన ఈ సినిమా ఈ సంవత్సరం చివరి నాటికి షూటింగ్ పూర్తి చేసుకుని నెక్ట్స్ ఇయర్ రిలీజ్  సమ్మర్ కి ఫస్ట్ పార్ట్ రిలీజ్ కు రెడీ అవుతోంది. సెకండ్ పార్ట్ రిలీజ్ సంగతి ఇంకా చెప్పలేదు మణి.

మరింత సమాచారం తెలుసుకోండి: