క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం ఐశ్వర్యారాయ్ తో పాటు సౌత్ స్టార్స్ తో ఎపిక్ మల్టీస్టారర్ ని తెరకెక్కిస్తున్నాడు. పొన్నియున్ సెల్వన్ టైటిల్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబందించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ రివీల్ చేశాడు మణిరత్నం. సౌత్ నుంచి మరో ఎపిక్ మూవీ రెడీ అవుతోంది. క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం లవ్ స్టోరీలే కాకుండా తన మార్క్ భారీ మల్టీస్టారర్ పొన్నియున్ సెల్వన్ తెరకెక్కిస్తున్నాడు . భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబందించి ఇంట్రస్టింగ్ న్యూస్ చెప్పాడు మణిరత్నం. డిసెంబర్ లో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఓ భారీ షెడ్యూల్ తర్వాత కరోనా బ్రేక్ తీసుకుంది.
తమిళ్ రైటర్ కల్కి క్రుష్ణమూర్తి రాసిన నవల్ ఆధారంగా తీస్తున్న పొన్నియున్ సెల్వన్ హిస్టారికల్ పీరియాడిక్ డ్రామా స్టోరీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, కార్తి, విక్రమ్, త్రిష, జయం రవి, లాంటి స్టార్ కాస్ట్ తో వస్తున్న ఈ సినిమా ఒకటి కాదు రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఎట్ ఎ ఫ్లో ఈ సంవత్సరం చివరి వరకూఈ సినిమాని షూట్ చేసి 2 పార్ట్స్ గా రిలీజ్ చేస్తానంటున్నాడు మణిరత్నం.
థాయిలాండ్ అడవుల్లో షూటింగ్ స్టార్ట్ చేసి తర్వాత కేరళ అడవుల్లో కూడా షూటింగ్ జరుపుకుంది పొన్నియున్ సెల్వన్ టీమ్. నిజానికి పొన్నియున్ సెల్వన్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ . అయితే చాలా రోజుల నుంచి తెరకెక్కిద్దామనుకుంటున్న ఈ సినిమా రకరకాల కారణాలతో పెండింగ్ తో పడుతోంది. ఫైనల్లీ లాస్ట్ ఇయర్ మొదలైన ఈ సినిమా ఈ సంవత్సరం చివరి నాటికి షూటింగ్ పూర్తి చేసుకుని నెక్ట్స్ ఇయర్ రిలీజ్ సమ్మర్ కి ఫస్ట్ పార్ట్ రిలీజ్ కు రెడీ అవుతోంది. సెకండ్ పార్ట్ రిలీజ్ సంగతి ఇంకా చెప్పలేదు మణి.