తెలుగులో పవన్ కళ్యాణ్ కి ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అందరికి తెలిసిందే. ఆయన తో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు అందరూ కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సినిమా హిట్ అయితే చాలు వసూళ్లు కూడా భారీగా వచ్చే అవకాశం ఉందని భావిస్తారు,. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు. అయన మూడు సినిమాలను ఓకే చేసారు. వచ్చే ఏడాది ఈ మూడు సినిమాల్లో రెండు సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో ఆయన నటిస్తున్నారు. 

 

సినిమా పింక్ అనే బాలీవుడ్ సినిమా రీమేక్ గా వస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కథను కూడా క్రిష్ పూర్తి చేసారు, వచ్చే ఏడాది ఈ సినిమాను మొదలు పెట్టే అవాకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ఏ ఒక్క సినిమా కూడా షూటింగ్ కి వెళ్ళే అవకాశాలు దాదాపుగా లేవు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది కూడా. అందుకే ఇప్పుడు ఈ సినిమాలను వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇక నుంచి తన సినిమాలకు తానే నిర్మాతగా వ్యవహరించాలి అని ఆయన భావిస్తున్నారట. 

 

ప్రస్తుతం చేస్తున్న వకీల్ సాబ్ సినిమా తర్వాత అన్ని సినిమాలకు ఆయనే నిర్మాతగా వ్యవహరించే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఆయనకు ఇప్పుడు నిర్మాతలతో కొన్ని సమస్యలు వచ్చాయని అందుకే తన సినిమాలను తానే నిర్మించుకుంటే ఏ గోలా ఉండదు అనే భావనాలో పవన్ కళ్యాణ్ ఉన్నారని అంటున్నారు. ఈ మధ్య పవన్ కి నిర్మాతలకు మధ్య గొడవలు అనే ప్రచారం జరిగింది. .

మరింత సమాచారం తెలుసుకోండి: