సూపర్ స్టార్ మహేష్ బాబు... ఈయన ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిన సంగతే. మహేష్ బాబు, నమ్రత వంశీ చిత్రంలో కలిసి నటించేటప్పుడు వీరిద్దరూ మధ్య ప్రేమ చిగురించింది. అయితే కొన్ని పరిణామాల దృష్ట్యా వీరిద్దరి వివాహం కేవలం వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరిగింది. నిజానికి నమ్రత బాలీవుడ్ లో మంచి మోడల్ గా పేరు సంపాదించుకున్న వ్యక్తి. అంతే కాదు బాలీవుడ్ లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న నమ్రత అక్కడ కొన్ని సినిమాలు చేసింది. నమ్రత "మిస్ ఇండియా" కిరీటం కూడా గెలుచుకుంది. అయితే మహేష్ బాబు నమ్రత ప్రేమించక ముందు నమ్రత వేరొకరితో రిలేషన్ లో ఉందని తను ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది.

 

నమ్రత దీపక్ శెట్టి అనే వ్యక్తితో కొన్ని రోజుల పాటు డేటింగ్ చేసిందట. అయితే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటామని అప్పట్లో అనుకున్నారు. కాకపోతే కాలం కలిసి రాక వీరిద్దరూ విడిపోయారు. ఆ సమయంలో నమ్రత తన జీవితంలో నిరాశా, నిస్పృహలు నెలకొన్నాయని కానీ వాటన్నిటినీ వదిలి తాను జీవితంలో ముందుకు కదలానని నమృత ఇంటర్వ్యూ లో చెప్పిందంట.


అందులోంచి బయట పడ్డాక నమ్రతకు సినిమా అవకాశాలు ఒకదాని తర్వాత ఒకటి రావడంతో బిజీ అయిపోయింది. ఈ బిజీ కాలంలోనే మహేష్ బాబుతో పరిచయం ఏర్పడింది. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అది పెళ్లి వరకు సాగి ప్రస్తుతం వారు సుఖంగా జీవిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ గా కొనసాగుతూ చాలా బిజీగా సినిమాలు చేస్తున్నాడు. అయితే నమ్రత మాత్రం ఇంట్లోనే ఉండి తల్లిగా బాధ్యతలను నిర్వహిస్తోంది. వీరిద్దరికీ గౌతమ్, సితార కొడుకు కూతురు ఉన్నారు అన్న సంగతి తెలిసిన విషయమే. కొడుకు గౌతమ్ కూడా నేనొక్కడినే సినిమాలో మహేష్ చిన్ననాటి పాత్రని నటించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: