ప్రభాస్ తో సినిమా అంటే ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ ఉండాల్సిందే. బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నాడు. ప్రభాస్ ని చూడడం కోసం జపాన్ నుండి అభిమానులు వచ్చారంటేనే, అతని స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రభాస్ తో చేసే సినిమాలన్నీ భారీగానే ఉండాలి. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించడానికి ఎక్కువ డబ్బులు పెట్టాల్సిందే.

 

అయితే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న పీరియాడికల్ లవ్ డ్రామా భారీ బడ్జెట్ అయినప్పటికీ బాహుబలి, సాహో కంటే చాలా తక్కువ మొత్తంలోనే తెరకెక్కిస్తున్నారని సమాచారం. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాధాక్రిష్ణ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహానటి సినిమా ద్వారా తానేంటో నిరూపించుకున్న అశ్విన్ ప్రభాస్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.

 

సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కే ఈ సినిమా కాలంలో ప్రయాణించడం అనే కథాంశంతో తెరకెక్కనుందట. నాగ్ అశ్విన్ కి బాగా ఇష్టమైన ఆదిత్య ౩౬౯ సినిమాలో లాగే ఈ సినిమాలోనూ ప్రభాస్ కాలంలో ముందుకీ, వెనక్కీ వెళతాడట. అయితే సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెలుగులో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ప్రభాస్ తో చేసే ఈ చిత్రం చాలా కొత్తగా ఉండనుందట.

 

 


నాగ్ అశ్విన్ చెప్పినట్టు పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ లో రూపొందుతుందట. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ బడ్జెట్ ని మించిన బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుందట. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ౫౦౦కోట్ల బడ్జెట్ ని అనుకుంటున్నారని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: