తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న మోస్ట్ క్రేజీ కపుల్స్‌లో పవన్, రేణు దేశాయ్ కూడా ఉంటారు.. వీళ్లు విడిపోయినా కూడా ఈ ఇద్దరి పేర్లు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి.  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాన్, అమీషా పటేల్, రేణు దేశాయ్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ ‘బద్రి’.  ఈ మూవీలో రేణు దేశాయ్ - పవన్ కళ్యాన్ కెమిస్ట్రీ ఎంతో చక్కగా కుదిరింది.  ఆ తర్వాత ఈ జంట జాని మూవీలో నటించారు.  బద్రి మూవీ షూటింగ్ లోనే ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు.. ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు.  ఈ జంటకు అకిరా నందన్, ఆద్యలు జన్మించారు.  రేణు దేశయ్ సైతం పవన్ కళ్యాన్ పట్ల ఎంతో గౌరవంగా.. ఆనుబంధంతో ఉంటారు.  

 

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'బద్రి' ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ రోజుతో 20 ఏళ్లు అయింది.  ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి తాజాగా రేణు దేశాయ్ ప్రస్తావిస్తూ, 'బంగాళా ఖాతంలో .. 'అంటూ సాగే ఒక పాట షూటింగ్ సమయంలో తీసిన ఫొటోను సోషల్ మాద్యంలో పోస్ట్ చేశారు.  ఈ సందర్బంగా మాట్లాడుతూ... విదేశాల్లో సిటీకి దూరంగా వుండే ఒక రిమోట్ ఏరియాలో  షూటింగు జరిగింది. అక్కడ విపరీతమైన గాలి వస్తుంది.. నిలబడలాన్న ఇబ్బందిగానే ఉండేది.  

 

ఆ సమయంలో పవన్ కళ్యాన్ అక్కడ ఒక బండ వుంటే  దానిపై కూర్చున్నారు.  అయితే నాకు కూర్చోవాలని ఉన్నా.. నేను షార్ట్ స్కర్ట్ వేసుకున్న కారణంగా ఆ బండపై కూర్చోలేకపోయాను. అయితే పవన్ తో మాత్రం ఒక అమ్మాయి పక్కన నిలబడి ఉండగా కూర్చోవడం బ్యాడ్ మేనర్స్  అంటూ కల్యాణ్ గారితో జోక్ చేశాను.. అందుకు ఆయన ఓ నవ్వునవ్వారు.  మొత్తానికి ఎన్నో కష్టాలు పడుతూ.. ఆ షూటింగ్ పూర్తి చేశామన్నారు రేణు దేశాయ్.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: