డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ఈరోజుకి సక్సెస్ ఫుల్ గా తన రెండు దశాబ్దాల సినీ కెరియర్ ముగించుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాథ్ ఆ సినిమా నుండి ఇస్మార్ట్ శంకర్ వరకు తన దర్శకుడిగా తన సత్తా చాటుతూ వస్తున్నాడు. పూరి డైరక్షన్ లో సినిమా అంటే సినిమా పక్కా హిట్ అనే టాక్ వచ్చేలా ఫామ్ కొనసాగించాడు. అయితే టెంపర్ తర్వాత పూర్తిగా ట్రాక్ తప్పిన పూరి జగన్నాథ్ మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్నాడు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సెన్సేషనల్ హిట్ అందుకుంది. 

 

ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు పూరి జగన్నాథ్. బద్రి రిలీజై 20 ఏళ్ళు అవుతున్న సందర్భంగా పూరికి సినీ ప్రముఖుల నుండి విషెష్ అందుతున్నాయి. అందులో భాగంగా ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా పూరికి స్పెషల్ విషెష్ అందించింది. బెస్ట్ హ్యూమన్.. మీరు పొందిన ఈ సక్సెస్ కు పూర్తి అర్హులు అంటూ ట్వీట్ చేసింది. దానికి పూరి కూడా లవ్ యు నిధి.. నిన్ను బాగా మిస్ అవుతున్నా.. త్వరలోనే కలుద్దాం అంటూ రిప్లై ఇచ్చారు. పూరి, నిధి అగర్వాల్చాటింగ్ చూసిన ప్రేక్షకులు డైరక్టర్, హీరోయిన్ మధ్య మంచి అండర్ స్టాండింగ్ కుదిరిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 

అంతకుముందు సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలు చేసినా హిట్ అందుకొని నిధి ఇస్మార్ట్ శంకర్ హిట్ తో స్టార్ క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం మహేష్ మేనల్లుడు హీరోగా వస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఈ అమ్మడు త్వరలో మరో రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. పూరితో క్లోజ్ నెస్ చూస్తుంటే మళ్ళీ ఈ ఇద్దరు కలిసి సినిమా చేసేలా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: