ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయం పట్టుకుంది. ఎటు చూసిన కూడా కరోనా మాటనే వినపడుతుంది..రోజు రోజు కూ కరోనా వల్ల చాలా మంది మృత్యువాత పడుతున్నారు.. మరీ కొందరు మాత్రం కరోనా కారణంగా క్వారంటైన్ లో బాధపడుతున్నారు.. ఇకపోతే కరోనా కట్టడి లో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ పేరుతో ప్రజలను ఇళ్లకే పరిమితం అయ్యేలా చేసింది.. అయినా కూడా కరోనా ప్రభావం ఎక్కడా తగ్గలేదు..
కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది .. దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు .
కరోనా పై పోరాటానికి ప్రజలు సిద్దం కావాలని సినీ ప్రముఖులు ఉత్తేజ పరుస్తున్నారు.. వీడియోల ద్వారా జాగ్రత్తలు తెలిపితే మరీ కొందరు మాత్రం రకరకాలా వీడియో నుపొస్ట్ చేస్తూ అభిమానులకు కావలసిన ఉత్తేజాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు..ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీలు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకొస్తున్నారు.. పలుగురు విరాళాలను అందిస్తున్నారు.. మరికొంత మంది స్వయంగా వచ్చి ప్రజలకు కావలసిన అత్యవసర నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు..
నటీనటలందరూ తమలోని కొత్త ప్రతిభని వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ కథానాయిక శ్రుతిహాసన్ వంటింట్లో సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. తాజాగా తనకెంతో ఇష్టమైన దోసె, బెండకాయ పచ్చడిని స్వయంగా చేసి చూపించింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. అంతేకాక ‘‘బెండకాయ పచ్చడిని నేనెంతో ఇష్టపడతా. నాకు కారంగా ఉంటే చాలా నచ్చుతుంది. అందుకే ఎప్పుడీ పచ్చడి చేసినా మిర్చి ఎక్కువగా వేస్తుంటా’’ అని తన పోస్ట్లో పేర్కొంది . ప్రస్తుతం శృతి హాసన్ రవితేజ సరసన ‘క్రాక్’లో నటిస్తోంది.లాక్ డౌన్ అనంతరం సినిమా మళ్లీ సెట్స్ మీదకు వెళ్లనుంది..