టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి సోమ‌వారంతో 20 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యింది. 2000 ఏప్రిల్ 20వ తేదీన బద్రి సినిమా రిలీజ్ అయ్యింది. కెరీర్ ఆరంభంలోనే పూరి ఏకంగా అప్ప‌ట్లో స్టార్ హీరోగా ఉన్న వ‌ప‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా చేయ‌డం అప్ప‌ట్లోనే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న అమీషా ప‌టేల్ ఆ సినిమాలో హీరోయిన్ కావ‌డం.. ఇక ఆ సినిమాలో మ‌రో హీరోయిన్‌గా ఉన్న్ రేణు దేశాయ్ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ జీవిత భాగ‌స్వామి కావ‌డం లాంటి ఎన్నో సంచ‌ల‌నాలు ఈ సినిమాతో న‌మోదు అయ్యాయి.

 

ఆ త‌ర్వాత పూరి ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. ఇక పూరి జ‌గ‌న్నాథ్ సినిమాల‌కు బ్యాంకాంగ్‌కు ఎప్పుడూ లింక్ ఉంటుంది. పూరి ప్ర‌తి సినిమాలోనూ బ్యాంకాంగ్‌, ప‌టాయ్ బీచ్‌లు క‌నిపిస్తుంటాయి. ఇక పూరి క‌థ‌లు రాయాల‌న్నా బ్యాంకాంగ్‌కు వెళ్లిపోవాల్సిందే. ఈ క్ర‌మంలోనే త‌న తాజా ఇంట‌ర్వ్యూలో బ్యాంకాంగ్‌కు త‌నకు ఉన్న అవినాభావ సంబంధం గురించి వివ‌రించారు. తాను బ్యాంకాంగ్ వెళ్ల‌న‌ని... ఎయిర్‌పోర్ట్‌లో దిగి, పటాయా వెళ్తా. సముద్రం అంటే చాలా ఇష్టం. బీచ్‌ అంటే చాలా ఇష్టం. అక్కడే చచ్చిపోవాలని కోరిక అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: