టాలీవుడ్ లో ఈ ఏడాది రష్మిక మంధనా కు భారీగా డిమాండ్ ఉంది. ఆమె తో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు ఎక్కువగా పోటీ పడటం తో ఆమె ఇప్పుడు భారీగా రేటు కూడా పెంచింది. తక్కువ సినిమాలకే ఆమెకు మంచి పాపులారిటి వచ్చింది అనేది అర్ధమవుతుంది. చేసిన సినిమాలు తక్కువే అయినా సరే ఆమె మాత్రం దూకుడుగా సినిమాలు చేస్తుంది. ఈ ఏడాది రెండు సినిమాలను ఆమె హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. భీష్మ సినిమా ద్వారా నితిన్ తో ఆమె హిట్ కొట్టింది. సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా మహేష్ బాబు తో హిట్ కొట్టింది. 

 

ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ విజయాలనే సాధించాయి. మహేష్ బాబు సినిమా మంచి వసూళ్లు సాధించింది. దీనితో ఇప్పుడు ఆమె పూర్తిగా తెలుగు మీదే ఎక్కువగా దృష్టి పెట్టింది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఆమె సొంత భాష కన్నడం లో ఆమెకు ఆఫర్లు వచ్చినా సరే ఆమె మాత్రం ముందుకు రావడం లేదని తెలుగు సినిమాల కోసం గానూ అక్కడి సినిమాలను ఆమె పూర్తిగా పక్కన పెట్టింది అనేది టాలీవుడ్ జనాల మాట. అక్కడ భారీ ఆఫర్లు వస్తున్నా అగ్ర హీరోల పక్కన ఆఫర్లు వస్తున్నా సరే ఆమె మాత్రం చేయడం లేదు. 

 

ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఆమె తో సినిమా చేయడానికి ఇద్దరు అగ్ర హీరోలు కూడా ఆసక్తి చూపించినా సరే ఆమె మాత్రం నో అని చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె తెలుగులో టాప్ హీరోయిన్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడి దర్శకులు ఆమెకు ఎక్కువగా ఆఫర్లు ఇస్తూ వస్తున్నారు. దీనితో ఇక్కడి సినిమాల కోసం బాలీవుడ్ సినిమాలను కూడా ఆమె పక్కన పెట్టినట్టు వార్తలు కూడా వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: