డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన 20 సంవత్సరాలు అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘బద్రి’ సినిమా తో ఇండస్ట్రీకి పరిచయమైన పూరిజగన్నాథ్ తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు తో తీసిన పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. సినిమా అతి తక్కువ టైమ్ లోనే తీసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం డైరెక్టర్ పూరీ కే సాధ్యం అవుతుందని ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. అటువంటి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 34 సినిమాలు రాగా, రెండు సినిమాలకు స్టోరీ అందించడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలతో పని చేశారు పూరి జగన్నాథ్.

 

ఈ నేపథ్యంలో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణతో పైసా వసూల్ అనే సినిమా అప్పట్లో తెరకెక్కించిన విషయం మనకందరికీ తెలిసినదే. అయితే ఈ సినిమా గురించి పూరి జగన్నాథ్ బాలకృష్ణ దగ్గరికి స్టోరీ చెబుదామని వెళ్లిన సమయంలో...బాలయ్య బాబు ఇచ్చిన షాక్ కి పూరి మైండ్ బ్లాక్ అయ్యిందట. పూర్తి మేటర్ లోకి వెళ్తే ఈ సినిమా గురించి పూరి మాట్లాడుతూ…”నేను ఆయనకు కేవలం 10నిమిషాలు మాత్రమే కథ చెప్పా. వారం రోజుల్లో పూర్తి స్క్రిప్ట్‌ చెబుతానని అన్నా. ఆయన వద్దన్నారు. ‘నీ సినిమాలు చూశా. నువ్వేంటో నాకు తెలుసు. మనం షూటింగ్‌కు వెళ్లిపోదాం’ అన్నారు.

 

ఒక్కసారిగా నాకు మైండ్ బ్లాక్ అయింది.. తేడా సింగ్‌ అన్న పేరు కూడా ఆయనకు తెలియదు. అంటూ ఇటీవల సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు . దీంతో అప్పటి నుండి బాలయ్య బాబు అంటే మరింత గౌరవం పెరిగింది అని  పూరి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా ‘ఫైటర్’ అనే సినిమా తెరకెక్కుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: