టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. విశాఖ జిల్లా న‌ర్సీప‌ట్నానికి చెందిన పూరి వాళ్ల కుటుంబానికి ఓ థియేట‌ర్ ఉండేది. దానిపేరే పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌. ప్ర‌తి రోజు ఆ థియేట‌ర్లో సాయంత్రం సినిమాలు చూడ‌డంతోనే పూరికి సినిమాల ప‌ట్ల ఆస‌క్తి ఏర్ప‌డింది. అక్క‌డ నుంచి సినిమాల కోసం హైద‌రాబాద్ వెళ్లిన పూరికి కృష్ణ‌వంశీతో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ఆయ‌న్ను స్టార్ డైరెక్ట‌ర్ చేసింది. ఇక రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌గ్గ‌ర శిష్య‌రికం పూరికి ఏకంగా అమితాబ్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ తెచ్చిపెట్టింది. 

 

ఈ క్ర‌మంలోతానే తాను ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఇర‌వై ఏళ్లు అయిన సంద‌ర్భంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న జీవితానికి సంబంధించి పలు ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. ప్ర‌శాంతంగా ఉన్న మీ  చెరువులో పెద్ద పెద్ద బండరాళ్లు వేసి డిస్ట్రబ్‌ చేసింది రాంగోపాల్‌వర్మ అంటారు నిజమేనా ? అన్న ప్ర‌శ్న‌కు పూరి స్పందిస్తూ రాము త‌న చెరువ‌లోనే కాద‌ని.. అంద‌రి చెరువుల్లోనూ రాళ్లు వేశార‌ని చెప్పాడు.

 

అయితే తానంటే రామూకు ఎంతో ఇష్టం అని... హైద‌రాబాద్‌కు ఎప్పుడొచ్చినా నాతోనే ఉంటారు. ‘జీనియస్‌’లు ఎప్పుడూ ఫ్లాప్‌ ఇస్తారు. ఎక్కువ ప్రయోగాలు చేస్తారు. అందుకే విఫలమవుతుంటాయి. ఆయన దగ్గర పనిచేసిన వాళ్లలో దాదాపు 50మంది దర్శకులం అయ్యాం. ఆయన ఫ్లాఫ్‌లు తీయొచ్చు కానీ, ఆయన చేసి ప్రయోగాల వల్ల చాలా మందికి లైఫ్‌ వచ్చింద‌ని పూరి చెప్పాడు. మ‌రి పూరి చెప్పింది నిజ‌మే క‌దా..?

మరింత సమాచారం తెలుసుకోండి: