తెలుగు చిత్ర పరిశ్రమలో పూరి జగన్నాథ్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  హీరోని మాస్ హీరోగా పవర్ ఫుల్ హీరోగా   చూపించడంలో పూరి జగన్నాథ్ కు ఆయనకాయనే సాటి. ఇక పూరి జగన్నాథ్ సినిమాలలో  కూడా ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది. పూరి జగన్నాథ్ సినిమా లు అన్ని  ముక్కు సూటిగా ఉంటాయి. ప్రేక్షకులకు పూరి  సినిమాలు అంటే తెగ నచ్చేస్తూ ఉంటాయి. మాస్ ఎలిమెంట్స్ను కి  ఎక్కువగా ప్రాధాన్యత నిస్తూ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ తనదైన డైలాగ్ లను జత చేస్తూ ప్రేక్షకులను మైమరిపిస్తూ  ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ఆ తర్వాత ఎందుకు వరుస ప్లాప్ లతో   సతమతమయ్యాడు. 

 

 

 కానీ మొన్నటికి మొన్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు పూరి జగన్నాథ్. ఎప్పుడు క్యూట్ గా లవర్ బాయ్ లాగా కనిపించే రామ్ ను  పవర్ఫుల్ హీరోగా మాస్ ఎలిమెంట్స్ ఉన్న హీరో గా చూపించి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచాడు. అంతేకాకుండా తెలంగాణ యాసలో డైలాగులు చెప్పించి  మరింత అదరగొట్టాడు పూరి జగన్నాథ్ . అయితే తాజాగా ఈ టీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరైన దర్శకుడు పూరి జగన్నాథ్... తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 

 

 

 ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో చేయాల్సి ఉండి మిస్సయిన సినిమాలు ఏవో చెప్పుకొచ్చాడు పూరి జగన్నాథ్. హీరో రవితేజకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఇడియట్ సినిమా కథ మొదట పవన్ కళ్యాణ్ కి వినిపించాడట పూరి జగన్నాథ్. అయితే ఇడియట్ సినిమా కథ చెబుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఎంజాయ్ చేశారని... కానీ చివరికి ఈ సినిమాకి ఎందుకు ఓకే చేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు పూరి జగన్నాథ్. అంతేకాకుండా అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా స్టోరీని కూడా ముందుగా పవన్ కళ్యాణ్ కు వినిపించినట్లు తెలిపాడు. కానీ పవన్ కళ్యాణ్ కి ఆ సినిమా స్టోరీ నచ్చకపోవడంతో సినిమా రవితేజ తో చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు పూరి జగన్నాథ్. ఈ రెండు సినిమాలు రవితేజ కెరియర్ ను  ఎంతగానో మలుపు తిప్పాయి  అని తెలిపాడు. అంతేకాకుండా మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమా కూడా పవన్ కళ్యాణ్ కు చెప్పగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు నో చెప్పడంతో మహేష్ బాబు తో ఈ సినిమా తెరకెక్కించాడు దర్శకుడు పూరి.ఈ సినిమా  కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: