తెలుగు చిత్ర పరిశ్రమలో పూరి జగన్నాథ్ కి ఒక ప్రత్యేకమైన స్టైల్  ఉంటుంది. ఆయన  సినిమాల్లో హీరోయిజం కూడా సపరేట్ స్టైల్ లో  ఉంటుంది. అందుకే పూరి జగన్నాథ్ సినిమాలంటే చాలు యూత్ కి కిక్  ఎక్కుతుంది. అదిరిపోయే పవర్ ఫుల్ పంచ్ డైలాగులు... పవర్ ఫుల్ హీరోయిజం... ఇలా పూరి సినిమాల గురించి చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా తనదైన టేకింగ్ తో తనదైన  డైలాగ్ లతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ  ఉంటాడు పూరిజగన్నాథ్. పూరి జగన్నాథ్ ఖాతాలో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఎన్నో సినిమాల్లో  బాక్సాఫీస్ ని ఒక రేంజ్ లో షేక్  చేసాడు. 

 

 

 ప్రతి హీరోలోని గొప్ప  నటుడ్ని వెలికి తీసి విశ్వరూపం చూపించేలా  చేయగలరు పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ సినిమాలో స్టోరీ మొత్తం ముక్కుసూటిగా ఉంటుంది... యువతను ఆకర్షించే విధంగా అదిరిపోయే పంచ్ డైలాగ్లు ఉంటాయి. అందుకే పూరి సినిమాలు అంటే తెగ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు యూత్. అయితే గత కొంత కాలంగా పూరి జగన్నాథ్ వరుస ప్లాపులతో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చ బాక్సాఫీస్ వద్ద సత్తా చాట లేకపోతున్నాడు. కానీ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో  మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు పూరి జగన్నాథ్. 

 

 

 ఈ సినిమా బంపర్ విక్టరీ సాధించింది. ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు పూరి జగన్నాథ్. సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు మీరు ఎంత డబ్బు నష్టపోయారు అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు పూరి జగన్నాథ్. ఇప్పటివరకు ఏకంగా వంద కోట్లకు పైగానే నష్టపోయానని చెప్పాడు. ఇండస్ట్రీలో తాను ఎంతగానో డబ్బు సంపాదించానని నాకు తెలిసినంతవరకూ నేను సంపాదించిన ఎంత డబ్బు ఏ దర్శకుడు  కూడా సంపాదించి ఉండకపోవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ చాలామంది డబ్బులు తీసుకొని నన్ను మోసం చేశారు అంటూ చెప్పుకొచ్చాడు పూరి జగన్నాద్ .

మరింత సమాచారం తెలుసుకోండి: