సినీ రంగంలోకి ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా పరిచయం అయ్యారు.. కొంత కాలంగా తమ కూతుళ్లను కూడా హీరోయిన్లు గా పరిచయం చేస్తున్నారు. విశ్వనటుడు కమల్ హాసన్ పెద్ద కూతురు శృతి హాసన్ హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది. స్వతహాగా శృతిహాసన్ మంచి రైటర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్. హీరోయిన్ గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎంత వేగంగా పాపులారిటీ తెచ్చుకుందో అంతే వేగంగా కనుమరుగైంది. దానికి కారణం ఆమె ప్రేమ వ్యవహారం.. లండన్కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైఖెల్ కోర్సేల్తో ఆమె కొంతకాలంగా డేటింగ్ చేశారు. ఆ తర్వాత వీరి మద్య బ్రేకింగ్ రావడం.. కొంత కాలం డిప్రెషన్ కి వెళ్లిపోవడం జరిగింది.
ప్రస్తుతం శృతి హాసన్ రీ ఎంట్రీ ఇస్తుంది.. రవితేజ నటిస్తున్న ‘క్రాక్’ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించేందుకు సిద్దం అవుతుంది. ప్రస్తుతం దేశంలో కరోనా ఏ రకంగా విస్తరిస్తుందో తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది సినీ సెలబ్రెటీలు తమ వంతు విరాళం ఇస్తూ సినీ కార్మికుల ముఖాల్లో చిరునవ్వు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు ఆమె విరాళాన్ని ప్రకటించకపోవడంపై సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు ప్రశ్నించారు.
తాజాగా ఈ విషయం పై శృతిహాసన్ స్పందించారు. నాకు చెప్పేవారు కరోనా బాధితులకు ఎంతగా సేవ చేస్తున్నారో తెలుసుకోవాలని వుంది. మనం ఇతరులకు ఎంత సహాయం చేస్తే, భగవంతుడు మనకి కూడా అంతగా సహాయం చేస్తాడని నమ్మే వ్యక్తిని నేను. అలాంటి నేను ఎవరితోనూ చెప్పించుకోవాలని చూడను. ఏ సాయమైనా నా మనసుకు నచ్చితే చేస్తాను.. ఒకరు సలహా ఇస్తే చేయను.. ఇతరులు ఆదేశించారు గదా అని చేసే అలవాటు మాత్రం లేదు. నేను చేసిన దాన ధర్మాల గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి నాకు లేదు అన్నారు.