టాలీవుడ్ డార్లింగ్, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న తాజా సినిమాకు జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటి, ప్రేమపావురాలు హీరోయిన్ భాగ్యశ్రీ, ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటిస్తుండగా యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు ఈ సినిమాని ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తి అయినట్లు సమాచారం. 

 

ఇక కొద్దిరోజుల క్రితం జార్జియా దేశంలో ఎంతో అట్టహాసంగా ప్రారంభం అయిన ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్, ఇటీవల సడన్ గా కరోనా ప్రభావం వలన ప్రపంచం మొత్తం కూడా అలెర్ట్ అవడంతోపాటు ఎక్కడి ప్రజలను అక్కడే తమ ఇళ్లలో ఉండేలా దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించడంతో జార్జియా నుండి సినిమా యూనిట్ అర్ధాంతరంగా వచ్చేయాల్సి వచ్చింది. ఆపై మన దేశాన్ని కూడా మే 3 వరకు పూర్తిగా లాక్ డౌన్ చేయడంతో షూటింగ్స్ అన్ని కూడా పూర్తిగా నిలిపివేయబడ్డాయి. వాస్తవానికి మొన్నటి ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ కూడా అనౌన్స్ చేయాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వలన అవి రిలీజ్ కాలేదు. కాగా ఈ సినిమాకు జాన్ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉన్నప్పటికీ, సినిమాకు ఓ డియర్ అనే టైటిల్ ని పెట్టాలని యూనిట్ భావిస్తున్నట్లు టాక్. మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా బాహుబలి మాదిరిగా మంచి హిట్ కొడుతుందా లేక మొన్నటి సాహో మాదిరిగా యావరేజ్ గా నిలుస్తుందా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

 

అయితే లేటెస్ట్ గా కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీ అయినప్పటికీ, సినిమాలో కీలకమైన కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని, వాటిని దర్శకుడు సహా యూనిట్ మొత్తం ఎంతో గ్రాండ్ లెవెల్లో చిత్రీకరించడానికి ప్లాన్ చేసిందని, ఇప్పటికే సినిమాకు సంబంధించి తీసిన రెండు ఫైట్స్ ఎంతో అదిరిపోయాయని అంటున్నారు. మొత్తంగా చెప్పాలంటే, ఈసారి రెబల్ స్టార్ కొట్టే దెబ్బకి, బాక్సాఫీస్ రికార్డులన్నీ అబ్బా అనాల్సిందే అని సమాచారం. మరి ఈ వార్తే కనుక నిజం అయితే మాత్రం రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది మంచి పండుగ వార్త అని చెప్పవచ్చు....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: