ఫిదా సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన యువ భామ సాయి పల్లవి. వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అంతకముందు ఢీ వంటి డ్యాన్సింగ్ షోల్లో పాల్గొన్న మంచి అనుభవం గల సాయి పల్లవి, ఆ సినిమాలో తన ఆకట్టుకునే యాక్టింగ్ తో పాటు డ్యాన్స్ లు కూడా అదరగొట్టింది. ఇక ఆ తరువాత అక్కడక్కడా కొన్ని సినిమాల్లో నటిస్తూ ముందుకు సాగుతున్న సాయి పల్లవి, ప్రస్తుతం మంచి బ్రేక్ కోసం చూస్తోంది. 

IHG

ఇక మరోవైపు ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తాను తెరకెక్కించిన అలవైకుంఠపురములో సినిమాతో మంచి హిట్ కొట్టిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, తదుపరి జూనియర్ ఎన్టీఆర్ తో తీయబోయే అయినను పోయి రావలె హస్తినకు సినిమాకు సంబందించిన కథ, స్క్రిప్ట్ వర్క్ ని సిద్ధం చేసే పనిలో నిమగ్నం అయ్యారట. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీగా పలు కమర్షియల్, ఎంటర్టైన్మెంట్ హంగులతో దర్శకడు త్రివిక్రమ్ తెరకెక్కించనున్నట్లు టాక్. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఇప్పటికే పలువురు పేర్లు ఇటీవల ప్రచారం అవ్వగా, తాజాగా అందుతున్న అప్ డేట్ ని బట్టి చూస్తే, ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిదా పిల్ల సాయి పల్లవిని తీసుకోవడానికి సిద్ధం అయ్యారట గురూజీ. 

 

వాస్తవానికి ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఎంతో చలాకీగా, జోష్ తో సాగుతుందని, అటువంటి పాత్రకు సాయి పల్లవి అయితేనే కరెక్ట్ అని భావించిన త్రివిక్రమ్, ఆమెకే మొగ్గు చూపారని, అలానే ఈ విషయాన్ని ఎన్టీఆర్ కి కూడా చెప్పడంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, అతి త్వరలో సినిమా విషయమై సాయి పల్లవిని ఫోన్ లో సంప్రదించనున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: