యువ హీరో నిఖిల్‌, దర్శకుడు చందు మొండేటి కలయికలో థ్రిల్లర్‌ కథాంశంతో 2014లో రూపొందిన ‘కార్తికేయ’ చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమా అప్పట్లో నిఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు అని నిఖిల్‌ను అభిమానులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇటు నిఖిల్‌తో పాటు డైరెక్టర్ చందు మొండేటిని సీక్వెల్ గురించి పదేపదే ప్రశ్నిస్తూ వస్తున్న నేపథ్యంలో ఆరేళ్ల తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ‘కార్తికేయ – 2 ‘ సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ‘కార్తికేయ'లో హీరోయిన్ గా నటించిన కలర్స్ స్వాతి.. ‘కార్తికేయ 2’లోనూ నటించబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు అది నిజమేనని తెలుస్తోంది.

 

అయితే కలర్స్ స్వాతి ‘కార్తికేయ 2’లో జస్ట్ గెస్ట్ రోల్ లో మాత్రమే కనిపిస్తోందని.. ఆమె హీరోకి మాజీ ప్రేయసిగా నటించబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. కాగా స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే హిస్టారికల్ కి సంబంధించిన ఓ కాస్పెక్ట్ హైలెట్ అవునున్నాయట. పైగా సినిమాలో ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ తగ్గకుండా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాగూ ‘కార్తికేయ’ సినిమాతోనే డైరెక్టర్ గా మంచి డిమాండ్ తెచ్చుకున్న చందు.. లాస్ట్ మూవీ సవ్యసాచి అనుకున్నంతగా ప్రభావం చూపలేకపోయింది. ఆయన మళ్ళీ నిఖిల్ తో ‘కార్తికేయ 2’ తీసి… తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్ పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయని చెప్పవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: