రేయ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు సాయి ధరమ్ తేజ్ . ఇక ధర్మ తేజ్ కి సుప్రీమ్ సినిమాతో మంచి హిట్ సాధించుకున్నాడు. ఈ సినిమాలో తనదైన రీతిలో మంచి గొప్ప ప్రదర్శన చేసి అభిమానులను సొంతం చేసుకున్నాడు అనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సినిమా ప్రజలకు ఒక సందేశం కూడా ఇచ్చిందనే చెప్పాలి. ఆ తర్వాత నక్షత్రం, ఇంటలిజెంట్, పిల్లా నువ్వు లేని జీవితం, జవాన్, తేజ్ ఐ లవ్ యూ, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ప్రతి రోజు పండగే... , చిత్రలహరి ఇలా సినిమాలలో నటిస్తూ తన తెలుగు పరిశ్రమలో ముందుకు కొనసాగుతున్నాడు.

 

మొదటగా తేజ్ కి మంచి గుర్తింపు తెచ్చిన సినిమా " పిల్లా నువ్వు లేని జీవితం" ఒక మంచి హిట్ గా నిలిచింది అనే చెప్పాలి. ఇందులో సాయి ధరమ్ తేజ్, జగపతి బాబు సన్నివేశాలు సినిమాకు చాలా ప్లస్ అని చెప్పవచు. అలాగే ఎప్పటికి అప్పుడు తనదైన రీతిలో మంచిగా నటిస్తూ అందరి అభిమానాన్ని దోచుకున్నాడు అనే చెప్పాలి. ఇలా మొదటిలో ఒక రెండు మూడు సినిమాలు మేనమామ మెగా స్టార్ నటించిన సినిమాలో నుంచి పాటలు తన సినిమాలో రీమేక్ సాంగ్స్ చేసి తన మార్క్ ను చాటుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఏదేమైనా గాని సాయి ధరమ్ తేజ్ కు ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది అనే చెప్పాలి. ఇక ఇటీవల విడుదలైన ప్రతి రోజు పండుగే... సినిమాలో కూడా కుటుంబ కథ చిత్రంగా తీశారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ " సోలో బతుకు " అనే సినిమాలో నటిస్తున్నాడు.

 


ఈ సినిమాలో సాయి ధర్మ తేజ్ సరసన నబ నటాషా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని మే 1 న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ప్రస్తుతం మాత్రం లాక్ డౌన్ సమయంలో ఈ సినిమా ఇప్పట్లో విడుదలయ్యే అవకాశాలు కనపడటం లేదు. ఇది కూడా సాయి ధరమ్ తేజ్ కు ఒక మంచి హిట్ అవుతుందని అని అనుకుంటున్నారు ఆ సినిమా వర్గం వారు.

మరింత సమాచారం తెలుసుకోండి: