స్వీటీ... మాన తెలుగు ఇండస్ట్రీలో స్వీటీ అంటే అందరూ గుర్తు పట్టక పోవచ్చు కానీ... అనుష్క శెట్టి అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. తాను నటించించిన పాత్రలు, తన మంచితనంతో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది అనుష్క. అనుష్కాని స్టార్ డైరెక్టర్ పూరి తాను దర్శకత్వం నిర్వహించిన సూపర్ సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయం చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే 2006 సంవత్సరంలో వచ్చిన స్టాలిన్ సినిమాలో ఒక పాటలో స్వీటీ నటించింది. 

 

ఇక అగ్ర హీరోలో సరసన నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది. అనుష్క నటించిన అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి-1, బాహుబలి -2, భాగమతి ఈ సినిమాలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది అనే చెప్పాలి. రుద్రమదేవి ఒక చారత్రాత్మక సినిమాగా రూపొందిడడం జరిగింది. ఇక అరుంధతి సినిమాతో జేజమ్మ అంటూ... చాలా అద్భుతమైన ప్రదర్శన చేసింది అనే చెప్పాలి.  


గతంలో ప్రభాస్ సరసన మిర్చి సినిమాలో నటించింది. ఆ తరువాత పాన్ ఇండియా సినిమా అయిన బాహుబలి 1, 2 సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అలాగే ఎప్పటికప్పుడు తనకంటూ మంచి హిట్ సాధించిన హీరోయిన్ అనే చెప్పాలి. అయితే తాజాగా " నిశ్శబ్దం " సినిమాలో మూగ, చెవిటి అమ్మాయిగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది అనే చెప్పాలి.

అయితే ఇది ఒక్క హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీగా రూపుదిద్దారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ.. తనకు ప్రభాస్ కు ఉన్న అనుబంధం గురించి తెలియజేసింది. ఇక ఇలా లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటూ తన కుటుంబ సభ్యులతో సమయాన్ని సంతోషంగా గడిపిందనే అనే చెప్పాలి. తాజాగా తన నాన్న బర్తడే సందర్భంగా ఒక ఫోటోను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: