కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు చేస్తుండటంతో అన్నిరంగాలు మూతపడ్డాయి.ఇక టాలీవుడ్కు కూడా ఇది పెద్ద దెబ్బేనని చెప్పాలి. కానీ తప్పదుగా. వాస్తవానికి టాలీవుడ్ సినీ పరిశ్రమ నుంచి చాలామంది హీరోలు..హీరోయిన్లు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అవగాహన కల్పించే వీడియోలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇంట్లో ఉంటూ తమ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్న ఫొటోలను..షేర్ చేస్తున్నారు. అలాగే ఇమేజ్లన్నీ పక్కన పెట్టి సామాన్యుల్లాగా ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేసుకుంటున్నారు.
దేశం గర్వించే దర్శకుడు జక్కన్న కూడా ఏకంగా చీపురు పట్టుకుని ఇంట్లో చెత్తను ఎత్తేశాడు. స్వయంగా వీడియో కూడా షేర్ చేశాడు. మన పని మనం చేసుకోవడంలో ఎలాంటి తప్పిందం లేదని మంచి మెస్సేజ్ ఇచ్చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే... మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక అని చెప్పాలి. మంచి కథాంశాలతో కూడిన చిత్రాల్లో నటిస్తూ తక్కువ కాలంలో విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంది. ‘ఒక మనసు’ సినిమాతో కథానాయికగా ప్రేక్షకులకు పరిచయమైంది మొదలు ఈ హీరోయిన్కు మంచి ఆఫర్లు పలికించాయి.
ఇక ఆ సినిమా తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సుర్యకాంతం’లో నటించిన నటన పరంగా మంచి మార్కులు తన ఖాతాలో వేసుకుంది. తాజాగా నిహారిక యాంకర్ రవితో కలిసి ఇన్స్టాగ్రామ్ లైవ్లో మాట్లాడింది. ఈ సందర్భంగా పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తారా..? అని రవి అడిగిన ప్రశ్నకు ‘నేను సమంత కాదు. కాబట్టి పెళ్లి తర్వాత నటిస్తానా? నటించలేనా? అనే విషయాన్ని ముందుగానే చెప్పలేను అంటూ గడసరిగా సమాధానం చెప్పేసింది. సాధ్యమైనంత వరకు ఎక్కువ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నిస్తానంటూ చెప్పింది. అంతేకాదు..ఇన్నాళ్లు రోమాంటిక్ సినిమాల్లో పెద్దగా నటించని నిహారిక త్వరలో ‘గ్లామరస్ పాత్రలు కూడా పోషించబోతున్నా. నా తర్వాతి తమిళ ప్రాజెక్టు రొమాంటిక్ చిత్రమే అంటూ చెప్పుకొచ్చింది.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple