టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి నిన్న సోమవారానికి రెండు దశాబ్దాలు అయ్యింది. దీంతో ప్రతి ఒక్కరు పూరి ఇరవై ఏళ్ల సినీ జీవితాన్ని గుర్తు చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు చెపుతున్నారు. కొందరు పూరిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నిన్న సోషల్ మీడియా అంతా పూరి గురించే చర్చ జరిగింది. ఇతర భాషలతో పాటు బాలీవుడ్కు చెందిన సెలబ్రిటీలు కూడా పూరిని అభినందిస్తూ ట్వీట్లు చేశారు.
ఈ క్రమంలోనే రఘు కుంచె అయితే పూరిని ఆకాశానికి ఎత్తేస్తూ ఏకంగా పెద్ద పోస్టే పెట్టాడు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమా ఛాన్స్ రాకముందు పూరి ఎన్ని కష్టాలు పడ్డాడు ? ఎవరి దగ్గరకు ఛాన్సుల కోసం వెళ్లాడు ? చివరకు పవన్ను ఎలా ఒప్పించాడు ? అలా పూరితో తనకు ఉన్న అనుభవాలు అన్నింటిని అందులో షేర్ చేసుకున్నాడు.
ఇక ఇందులో ఈ ఒక్క బద్రి సినిమా ఎందరో జీవితాలను మార్చేసిందని కూడా రఘు చెప్పాడు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్కు తెలుగులో వెనుదిరిగి చూసుకునే అవసరం కూడా రాలేదు. పవన్ నిజమైన పవర్ స్టార్ అయ్యాడు. ఇక పూరి టాప్ డైరెక్టర్ అయిపోయాడు. అమీషా పటేల్ తెలుగులో మంచి అవకాశాలు దక్కించుకుంది. ఇక ఈ మూవీ సమయంలోనే రేణు .. పవన్ ప్రేమలో పడి అటుపై వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాకు పనిచేసిన పాటల రచయితలు... పూరి దగ్గర పనిచేసిన అసిస్టెంట్లు మంచి అవకాశాలు దక్కించుకున్నారు. ఇక పూరి సంగతి చెప్పక్కర్లేదు. ఆయన తెలుగులో అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుని.. ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
A small Story About @purijagan 20 years journey of cinema .. From my heart ❤️ pic.twitter.com/ys3eup8UKY
— raghu kunche (@kuncheraghu) April 20, 2020