తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో అజిగ్ కుమార్.  సూపర్ స్టార్ రజినీ కాంత్ తర్వాత ఆ తరహా మాస్ ఇమేజ్ ఈ హీరో సొంతం.  అజిత్ కుమార్ ఎలాంటి మేకప్ లేకుండా చాలా సహజంగా నటిస్తారని టాక్.  అజిత్ కేవలం నటుడు మాత్రమే కాదు..  ఫోటోగ్రాఫర్, ఫార్ములా వన్ రేసర్, బైక్ రేసర్, పైలెట్ కూడా నడుపుతాడు.  ఇలా ఆయన ఎన్నో రంగాల్లోనూ ఆరితేరారు అజిత్. అన్నింటికన్నా ముఖ్యం అజిత్ కి బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం.. ఈ క్రమంలో ఆయన ఎన్నో ప్రమాదాలకు కూడా గురయ్యాడు.  తాజాగా హైదరాబాద్ నుంచి చెన్నై దాదాపు 650 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణం చేశారు. కేవలం ఫుడ్, పెట్రోల్ కోసమే మధ్యలో ఆగారని చిత్ర యూనిట్ చెబుతోంది.

 

కొద్దిరోజుల క్రితం ‘వాలిమై’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరిగింది. అందులో ఓ బైక్ చేజింగ్ సన్నివేశం ఉందట. దాని కోసం ప్రత్యేకంగా బైక్‌ను డిజైన్ చేశారని తెలుస్తోంది.  ఈ బైక్‌పై ముచ్చటపడిన అజిత్.. చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత అదే బైక్‌పై చెన్నై వెళ్లాలని నిర్ణయించుకున్నాడట. అంతే.. విమానం టికెట్లు రద్దు చేసుకున్న అజిత్.. బైక్‌పై ఒంటరిగా చెన్నై బయలుదేరాడు. అతడి అసిస్టెంట్ మాత్రం విమానంలో చెన్నై చేరుకున్నాడు. 

 

 

అజిత్ బైక్ రైడింగ్‌కు సంబంధించిన ఫొటోలను చిత్ర బృందం విడుదల చేసి విషయం చెప్పడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ విషయం తాజాగా బయటికి రావడంతో ఆయన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అజిత్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ‘తలా’ అజిత్ ఏం చేసినా ఓ ప్రత్యేకత ఉంటుందని అంటున్నారు.   అజిత్ కుమార్ బహుముఖ ప్రజ్ఞాశాలి  అని అందుకే అంటుంటారు.  గతంలో ఓటింగ్ సైతం క్యూలో నిల్చొని వేశారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: