ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయం పట్టుకుంది. ఎటు చూసిన కూడా కరోనా మాటనే వినపడుతుంది..రోజు రోజు కూ కరోనా వల్ల చాలా మంది మృత్యువాత పడుతున్నారు.. మరీ కొందరు మాత్రం కరోనా కారణంగా  క్వారంటైన్ లో బాధపడుతున్నారు.. ఇకపోతే కరోనా కట్టడి లో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ పేరుతో ప్రజలను ఇళ్లకే పరిమితం అయ్యేలా చేసింది.. అయినా కూడా కరోనా ప్రభావం ఎక్కడా తగ్గలేదు.. 

 

 

 

కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు . 

 

 

 

కరోనా మహమ్మారిని ఇంట్లోనే ఉంటూ కట్టడి చేయాలని చాలా మంది అనుకుంటున్నారు..అయితే ఈ మేరకు సినీ ప్రముఖులు కూడా అభిమానులకు సూచనలు ఇస్తూ ప్రజలను ఆకర్షించడానికి సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తున్నారు.. అయితే లాక్ డౌన్ తప్పక పాటిస్తే ఎటువంటి భాధలు ఉండవని తెలియ పరుస్తున్నారు.. 

 

 

 

 

ఇది ఇలా ఉండగా ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించే దర్శకుడు రాం గోపాల్ వ‌ర్మ‌ మరో సారి తన మార్క్ చూపించుకున్నారు.  ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనం సృష్టించాయి. లాక్ డౌన్ పిరియడ్‌లో  సీఎం కేసీఆర్ కు వ‌ర్మ‌ వింత ఛాలెంజ్ విసిరాడు. ప్రెస్ ముందు కేసీఆర్ గ్లాస్ విస్కీ తాగాలన్నారు.  లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణలో చాలా మంది మందు లేకుండా చచ్చిపోతున్నారని... వాళ్లందరూ కేసీఆర్ పెగ్ వేస్తుంటే చూస్తూ కుమిలిపోవాలన్నారు. అందరినీ ఆపేసి ప్రెస్ ముందు కూర్చొని కూర్చుని తాగుతున్న విజువల్.. దానికి ప్రజల రియాక్షన్ ... ఇవన్నీ వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తే అదిరిపోతుందంటూ సంచలనం సృష్టించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: