లాక్ డౌన్ లో సాధారణ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.  రెక్కాడితే గాని డొక్కా డని పరిస్థితులు దేశంలోని అన్ని ప్రాంతాలలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా వలస కూలీల పరిస్థితి చాలా  దారుణంగా ఉంది. ఈ పరిస్థితులలో కొందరు  సినీ ప్రముఖులు మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు సాధారణ ప్రజల  కోసం పాటుపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రకాష్ రాజ్ చేసిన ఓ ట్వీట్ నెటిజన్స్ ని  విస్మయానికి గురి చేసింది.

 

అదేంటంటే నా ఆర్థిక వనరులన్నీ క్షీణిస్తున్నాయి కానీ రుణాలను తీసుకుంటున్నాను అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది  ఎందుకంటే తన ఆర్థిక వనరులు తగ్గినా మళ్లీ వాటిని నేను సమకూర్చుకో గలను కానీ ఇలాంటి పరిస్థితులలో ప్రజలను ఆదుకో కపోతే మనిషై పుట్టి ప్రయోజనం లేదని అందుకే తాను తన దగ్గర తగినంత రొక్కం లేకపోయినప్పటికీ రుణం తీసుకొని మరీ తాను పేద ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నానని ఆ ట్వీట్ లో తెలియజేశాడు. ఈ సందర్భంగా మడత పెట్టిన చేతులను విప్పి కలసి పోరాడాలి మరియు వారి జీవితాలను తిరిగి నిలిపే ప్రయత్నం చేద్దామని ప్రకాష్ రాజ్ తన ఫౌండేషన్ ద్వారా కోరాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: