బాలయ్య అంటే టాలీవుడ్ కి సీనియర్ హీరో. మాస్ హీరో అన్న దానికి అసలైన అర్ధం చెప్పిన హీరో. అటువంటి బాలయ్య అన్న నందమూరికి  అచ్చమైన నట వారసుడు. ఆయన శతాధిక చిత్రాల్లో నటించి తన సత్తా చాటుకున్నారు. ఇప్పటికీ నటిస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. బాలయ్య గురించి ఒక డైరెక్టర్ చేసిన కామెంట్స్ ఇపుడు సంచలనంగా
ఉన్నాయి.

 

డైరెక్టర్ ఎవరో కాదు, పూరీ జగన్నాధ్. ఆయన బాలయ్యతో పైసా వసూల్ మూవీని  తీశారు. ఈ మూవీ హిట్ కాకపోయినా బాలయ్యని బాగా పూరీ చూపించాడని, ఎక్కడా బాలయ్య కనబడలేదని ఫ్యాన్స్ అంటారు. అచ్చం పూరీ మార్క్ స్టైల్ కి బాలయ్య సెట్ అయిపోయాడని కూడా అంటారు. ఇదిలా ఉండగా బాలయ్య మీద పూరీ తన అభిప్రాయాలను తాజాగా  కుండబద్దలు కొట్టారు.

 

అదేంటి అంటే బాలయ్య ముక్కుసూటి మనిషి. చెప్పుడు మాటలు అసలు వినరు. ఆయన ఏం చేసినా తాను ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కు తగ్గరు. మంచి తనానికి మారు పేరు బాలయ్య అంటూ కితాబులు ఇచ్చేశారు. నిజానికి తాను బాలయ్యతో ఓ సినిమా తీద్దామనుకున్నపుడు ఎంతో మంది ఆయనని కలసి వద్దు ని చెప్పారని పూరీ అన్నాడు.

 

అయితే బాలయ్య వారి మాటలను ఏ మాత్రం పట్టించుకోకుండా కధ చెప్పమన్నారని, పది నిముషాల్లో కధ చెప్పగానే ఒకే అనేశారని పూరీ చెప్పారు. ఇక ఈ సినిమాలో తేడా సింగ్ గా బాలయ్య బాగా నటించారని కూడా పూరీ మెచ్చుకున్నాడు. బాలయ్య లాంటి ఎనర్జటిక్ హీరోతో మళ్ళీ మళ్ళీ చేయాలని ఎవరైకైనా ఉంటుందని చెప్పే పూరీ బాలయ్య కోసం ఒక కధను ఈ లాక్ డౌన్ టైంలో రాస్తున్నాడుట. అన్నీ కుదిరితే పైసా వసూల్ కాంబో మరో మారు తెర మీదకు రావడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: