మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా కేటగిరీలోనే నిర్మిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమా తో పాటు చిరంజీవి కొంతమంది యంగ్ డైరెక్టర్స్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆచార్య సినిమా తర్వాత లూసీఫర్ రీమేక్ చేయనున్నారు మెగాస్టార్. ఈ సినిమాకి సుజీత్ దర్శకత్వం వహించనున్నాడు. సాహో లాంటి పాన్ ఇండియా సినిమాని తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ సుజీత్ కి మెగాస్టార్ సినిమా మూడోది మాత్రమే. ఇక నెక్స్ట్ సినిమా బాబి దర్శకత్వంలో ఉండనుందట. బాబి చెప్పిన కథ కూడా చిరంజీవి కి బాగా నచ్చిందని దాదాపు ఇదే నెక్స్ట్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. 

 

ఇలా వరసగా అందరూ యంగ్ డైరెక్టర్స్ కే ఛాన్స్ ఇస్తున్న చిరంజీవి మరికొంతమందిని లైన్ లో పెట్టినట్టు సమాచారం. అయితే ఇలా అందరూ యంగ్ డైరెక్టర్స్ అయితే నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోగలనని చిరంజీవి తన మనసులో మాటని బయట పెట్టారు. అంతేకాదు సీనియర్ డైరెక్టర్స్ ని ఇది తక్కువ చేయటం కాదంటూ క్లారిటి కూడా ఇచ్చారు. ఇక మెగాస్టార్ అనుకుంటున్న యంగ్ డైరెక్టర్స్ జాబితాలో హరీష్ శంకర్, పరశురాం, సుకుమార్, మెహర్ రమేష్ ..ఇలా లిస్ట్ చాలా పెద్దదే ఉంది. కాని ఇక్కడ షాకింగ్ విషయం అంటే చిరంజీవి అనుకుంటున్న లిస్ట్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ లేకపోవడం. 

 

ఇంతక ముందు మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ అనుకున్నప్పుడు పూరి జగన్నాధ్ చిరంజీవి కోసం ఒక కథ అనుకున్నారు. ఆ కథ ఫస్టాఫ్ నచ్చినప్పటికి సెకండాఫ్ చిరంజీవి గారికి నచ్చలేదని దాంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదన్న మాట వినిపించింది. అయితే పూరి చాలా సందర్భాల్లో అన్నయ్య సరే అంటే మంచి కథ రెడీ చేస్తానని కూడా ఓపెన్ గా చెప్పారు. మరి పూరి జగన్నాధ్ కథ చెప్పడానికి చిరంజీవి టైం ఇవ్వడం లేదా లేక మరేదైనా కారణం ఉందా తెలీదు గాని ఈ మధ్య చెప్పిన పేర్లలో కూడా చిరంజీవి పూరి జగన్నాధ్ పేరు ప్రస్తావించకపోవడం అందరికీ షాకింగ్ గా ఉంది. 

 

దాంతో ఇక ఈ కాంబినేషన్ లో సినిమా ఉండకపోవచ్చు అనే అంటున్నారు. కాని ఆఫ్ స్క్రీన్ వినిపిస్తున్న మాట మాత్రం కాస్త భిన్నంగా ఉంది. పూరి జగన్నాధ్ అందరికంటే స్పీడ్ గా సినిమా తీస్తారు. కాబట్టే చిరంజీవి "ఈ సమయంలో సినిమా పడాలి" అనుకున్నప్పుడు పూరి తో చేస్తారని అది అప్పటికప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టే ఇప్పుడు మాట్లాడటం లేదని అంటున్నారు.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: