మన తెలుగు ఇండస్ట్రీలో బాగా ప్రజా ఆదరణ పొందిన  స్టార్ హీరో జంటలలో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఆ సమయంలో ఎదురుకున్న సమస్యలు కూడా పక్కన పెట్టీ చివరికి కుటుంబసభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ల ప్రేమాయణం విషయానికి వస్తే.. ఇద్దరూ కలిసి నటించిన వంశీ సినిమా షూటింగ్ సమయంలో ఒకరినొకరు ఇష్టపడడం జరిగింది. 

 


ఇక అలాగే  ఇంట్లో కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇటు మహేష్ బాబు తండ్రి కృష్ణ, అటు నమ్రత తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీనితో నాలుగు సంవత్సరాల పాటు ఇంట్లో వారిని ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఇద్దరు. నిజంగా చెప్పాలి అంటే ఆ నాలుగేళ్లపాటు నేను మహేష్ కలుసుకోలేదు అని నమ్రత ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. అప్పుడప్పుడు ఫోన్స్ మాట్లాడే వాళ్ళం కానీ కలలో కూడా  కలిసే వాళ్ళం కాదు. ఆ తర్వాత ఇద్దరి కుటుంబసభ్యులను ఒప్పించి మా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఇద్దరికీ 2005 సంవత్సరంలో పెళ్లయింది. అంతేకాకుండా మహేష్ కి చాలా సిగ్గు. తను హీరోయిన్లతో ఎప్పుడూ సరిగ్గా మాట్లాడాడు అని నమ్రత తెలిపింది. 

 


ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. అంతే కాకుండా ఇటీవల మహేష్ నమ్రత 15 వ పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇక 1994లో నమ్రత మిస్ ఇండియా టైటిల్ కూడా గెలుచుకున్నారు. ఇక నమ్రత మన టాలీవుడ్ లో వంశీ, ఆ తర్వాత చిరంజీవి సరసన అంజి సినిమాలో నటించారు. ఇక బాలీవుడ్లో హీరోయిన్ గా చాలా సినిమాలు తీశారు. ఇక పెళ్లి అనంతరం నమ్రత సినిమాలకు పూర్తిగా గుడ్ బాయ్ చెప్పింది అని అర్థమవుతుంది. ప్రస్తుతం వారు కుటుంబ సభ్యులతో లాక్ డౌన్ సమయాన్ని సంతోషంగా గడుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: