సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా నుండి రోజుకో వార్త వస్తుంది. అఫీషియల్ గా ఈ సినిమా నుండి ఎలాంటి వార్తలు రాకపోయినా, సోషల్ మీడియా ద్వారా రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలన్నీ నిజం అవుతున్నాయి కూడా. సామాజిక సందేశాలతో సినిమాలు చేసే కొరటాల ఈ సినిమాలో ఒక మంచి సందేశాన్ని చెబుతున్నాడట.

 

ఈ సినిమాలో ఒకానొక కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడని సమాచారం. అయితే ఈ పాత్రలో మహేష్ బాబు నటిస్తాడని వార్తలు వచ్చాయి. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి వచ్చిన తర్వాత, వీరిద్దరు కలిసి నటించబోతున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తలపై ఎవరూ స్పందించకపోవడం వల్ల కూడా అవి నిజమేనని అనుకున్నారు కూడా .

 

అయితే సడెన్ గా ఏమైందో ఏమో మహేష్ నటించట్లేదని అన్నారు. ఆ స్థానంలో రామ్ చరణ్ నటిస్తున్నాడని, రాజమౌళి ఆ విధంగా పర్మిషన్ ఇచ్చాడని చెప్పారు. అయితే ఆచార్యలోని ఆ కీలకమైన పాత్రని అసలు మహేష్ ని అనుకోలేదట. ఆ వార్త ఏ విధంగా బయటకి వచ్చిందో తెలియదని చిత్రబృందం తెలియజేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

మెగాస్టార్ చిరంజీవి మళయాల చిత్రమైన లూసిఫర్ ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకి తగ్గట్టుగా తీర్చిదిద్దడానికి సాహో డైరెక్టర్ సుజిత్ కసరత్తులు చేస్తున్నాడు. 
అయితే ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో అల్లు అర్జున్ నటిస్తాడన్న వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. మరి ఇవన్నీ గాలివార్తలేనా లేదా నిజం ఉందా అన్నది ఇప్పట్లో తెలిసేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: