టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తన ప్రస్థానం బుల్లితెరపై శాంతినివాసం తోమొదలు పెట్టారు. ఎన్టీఆర్ తో ‘స్టూడెంట్ నెం.1’ మూవీతో దర్శకుడిగా మంచి విజయం అందుకున్నాడు.  ఆ విజయం మొదలు మొన్నటి బాహుబలి 2 వరకు తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.  సాధారణంగా ఏ దర్శకులకైనా హిట్ ఫ్లాపులు ఉంటాయి.  కానీ టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ తన ఖాతాలో వేసుకోని సెన్సేషన్ డైరెక్టర్ రాజమౌళి.  ఇక రాజమౌళి మూవీలో నటించే ప్రతి హీరో ఒక డిఫరెంట్ స్టైల్లో చూపించడం ఆయన ప్రత్యేకత.. అందుకే ఆయన సినిమాల్లో నటించి ప్రతి హీరోకి చెప్పుకోదగ్గ గుర్తింపు వస్తుంది.  

 

 

ఈగ సినిమాలో కొద్ది సేపు కనిపించిన నాని కి ఎంత పెరు వచ్చిందో దాన్ని బట్టే చెప్పొచ్చు.  ఇక బాహుబలి, బాహుబలి 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో టాలీవుడ్ రేంజ్ ఏకంగా ప్రపంప స్థాయికి తీసుకు వెళ్లారు.  అప్పటివరకు బాలీవుడ్, కోలీవుడ్ మాత్రం కలెక్షన్ల రికార్డులు ఉంటే వాటిని బ్రేక్ చేశారు.  భారత్‌లోనే కాకుండా విదేశాల్లో సైతం ఆయనకు అభిమానులున్నారు.  టాలీవుడ్ సినిమాలు కూడా జాతీయ స్థాయిలో మెప్పిస్తాయి.. అనే స్థాయికి తీసుకు వెళ్లారు.  అలాంటి గొప్ప దర్శకుడికి ఓ సినిమా నచ్చలేదట. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన రాజమౌళి ఇటీవల `పారసైట్` సినిమా చూశారట.

 

ఆస్కార్ అవార్డు సాధించిన ఈ దక్షిణ కొరియా సినిమా రాజమౌళికి మాత్రం నచ్చలేదట. సినిమా కాన్సెప్ట్ ఎలా ఉన్నా నాకు మాత్రం బోర్ అనిపించింది.. ఎంతంగా అంటూ సినిమా చూస్తూ నేను నిద్రలోకి జారుకున్నా అన్నారు.  ఏ సినిమా ఉర్రూతలూగించేలా ఉండాలని.. అలాంటి సినిమాలే తనకు బాగా నచ్చుతాయని అన్నారు. రాజమౌళి అభిప్రాయం విని చాలామంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: