అల్లు అర్జున్.. పరిచయం అక్కర్లేని పేరు. మెగా ఫ్యామిలీ అండదండలతో హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినా.. సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. మొదట్లో ప్రేమకథా చిత్రాల్లో నటించిన బన్నీ.. ఆ తరవాత యాక్షన్ సినిమాలు చేస్తూ కమర్షియల్ హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ఇదే క్రమంలోనే తన స్టైలిష్ లుక్స్తో యూత్ ఐకాన్గా కూడా మారాడు. ఇక అల్లు అర్జున్ 2011లో స్నేహారెడ్డి ని ప్రేమించి.. పెద్దలను ఒప్పించి.. పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్లోని క్యూటెస్ట్ కపుల్ జాబితాలో ముందు వరుసలో అల్లు అర్జున్, స్నేహారెడ్డి జంట ఖచ్చితంగా ఉంటుంది.
అయితే వీరి ప్రేమ ఎక్కడ మొదలైంది..? అసలు వీరిద్దరు ఎక్కడ కలిశారు..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి స్నేహా రెడ్డి ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధంలేని అమ్మాయి. వ్యాపారవేత్త, విద్యాసంస్థల అధినేత కేపీఎస్ రెడ్డి కుమార్తె ఈమె. ఇబ్రహీంపట్నంలో బీటెక్ చదివిన స్నేహారెడ్డి.. అమెరికాలో ఎమ్మెస్ చేశారు. అయితే స్నేహా రెడ్డి ఓ ఫ్రెండ్ పెళ్లిలో అల్లు అర్జున్కు కనిపించింది. ఇక తొలిచూపులోనే స్నేహాను చూసిన బన్నీ ప్రేమలో పడ్డాడు. ఆమెతో అక్కడే పరిచయం కూడా చేసుకున్నారు. ఇక తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ, వీరిద్దరి పెళ్లికి అల్లు అరవింద్ తొలుత ఒప్పుకోలేదు.
అటు స్పేహా రెడ్డి తల్లిదండ్రులు కూడా వీరిద్దరి ప్రేమపెళ్లికి సుముకత చూపలేదు. అయినప్పటికీ స్నేహను మాత్రం బన్నీ వదిలిపెట్టలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా.. ఏదో విధంగా పెద్దలను ఒప్పించి చివరకు కులాలకు అతీతంగా స్నేహా రెడ్డిని పెళ్లాడాడు. ఇక ఈ పెళ్లి కోసం ఎక్కువగా కష్టపడింది మాత్రం అల్లు అర్జునేనని చాలా మంది అంటుంటారు కూడా. వీళ్లిద్దరికి ఇద్దరు పిల్లలు అయాన్, అర్హ కూడా ఉన్నారు. బన్నీ సినిమాలతో బిజీబిజీగా గడుపుతుంటే.. స్నేహ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంట్లో ఉంటున్న బన్నీ.. పూర్తి సమయాన్ని పిల్లలు, భార్యతోనే గడుపున్నాడు.