ఇండియన్ సినిమాలో ధూమ్ సిరీస్ కు ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది. సెపరేట్ మార్కెట్ ఉంది. అందుకే ధూమ్ సిరిసీస్ లో సినిమా వస్తుందంటే భారీ అంచనాలుంటాయి. ఈ అంచనాలకు తగ్గట్టే మూడు సినిమాలకు ముగ్గురు స్టార్స్ ని తీసుకుంది యశ్ రాజ్ ఫిల్మ్స్. అయితే ఈ సిరీస్ లో ఫోర్త్ వెంచర్ కు మాత్రం పెద్దగా ఇమేజ్ లేని హీరోని తీసుకొస్తున్నారట. దీంతో ఈ సిరీస్ స్టార్ ఇమేజ్ పై ప్రశ్నలొస్తున్నాయి. 

 

ధూమ్ సిరీస్ గురించి చెబితే చాలు భారీ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తుకొస్తాయి. జాన్ అబ్రహాం, హృతిక్ రోషన్ ల అడ్వెంచర్స్ కనిపిస్తాయి. ఈ అడ్వెంచర్స్ తోనే బోల్డంత మంది అభిమానులను సంపాదించుకుంది ధూమ్. అందుకే బాక్సాఫీస్ కూడా ఈ సిరీస్ ను చాలా స్పెషల్ గా చూస్తుంది. కానీ ఇప్పుడీ సిరీస్ స్టార్ వాల్యూ పడిపోయే ప్రమాదముంది అంటున్నారు బాలీవుడ్ జనాలు. 

 

ధూమ్ 1లో జాన్ అబ్రహాం అడ్వెంచర్ చేస్తే.. ధూమ్ 2లో హృతిక్ రోషన్ అదరగొట్టాడు. అందుకే ఈ సిరీస్ బోల్డంత పాపులర్ అయింది. ఈ పాపులారిటీ చూస్తే అమీర్ ఖాన్ ధూమ్ 3లో అడుగుపెట్టాడు. అయితే ఈ సినిమా ఫస్ట్ రెండింటి కంటే చాలా తక్కువ మార్కులు తెచ్చుకుంది. అయితే ధూమ్ 4 మాత్రం చర్చల దశలోనే స్టార్ వాల్యూ కోల్పోతోంది. 

 

ధూమ్ 4కు షారుఖ్ ఖాన్ ను తీసుకోవాలనుకున్నాడు నిర్మాత ఆదిత్యచోప్రా. కానీ జీరో తర్వాత షారుఖ్ ఇంటికే పరిమితమయ్యాడు. ప్రభాస్ ను తీసుకుంటారనే టాక్ వచ్చినా.. ఈ హీరో హెవీ ఫిజికల్ స్ట్రెయిన్ తీసుకోవడానికి సిద్ధంగా లేడని తెలుస్తోంది. దీంతో టైగర్ ష్రాఫ్ ను సంప్రదిస్తున్నాడట ఆదిత్యచోప్రా. ఇదే బాలీవుడ్ జనాలను ఆశ్చర్యపరుస్తోంది. అసలు బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ లేని టైగర్ ను ఎందుకు తీసుకుంటున్నాడని మాట్లాడుకుంటున్నారు. 

 

టైగర్ ష్రాఫ్ మజిల్డ్ బాడీతో భారీ యాక్షన్ సీక్వెల్స్ తీస్తుంటాడు. కానీ ఇప్పటి వరకు భారీ హిట్ లేదు. అసలు పెర్ఫామెన్స్ లోనూ ఎలాంటి మార్క్ చూపించలేదు. అలాంటి హీరోను ధూమ్ 4కు తీసుకోవడం సాహసమే అంటున్నారు సినీజనాలు. మరి ఆదిత్య ఎందుకు టైగర్ వైపు వెళ్తున్నాడు. ఈ నిర్మాత ఆలోచన సరైందా కాదా అనేది త్వరలోనే తేలనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: