ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో మరచిపోలేని గుర్తులు ,సన్నివేశాలు, వస్తువులు మరియు జ్ఞాపకాలు ఉంటాయి. భరత్ అనే నేను సినిమా ద్వారా పరిచయం అయిన అందాల తార కియారా అద్వానీ కూడా తన జీవితంలో మరచిపోలేని సన్నివేశాన్ని సోషల్ మీడియాలో పరిచయం చేసింది. తన చిన్ననాటి జ్ఞాపకాల లో భాగమైన సిండ్రెల్లా గురించి చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు తాను ఎంతో ఇష్టంగా చూసుకొని ఆ వస్తువు గురించి  ఇంటిపట్టునే ఉంటున్నా కియారా తన పాత జ్ఞాపకాలను వెలికి తీసింది. అందులో భాగంగానే తాను చిన్నతనంలో డిస్నీ మహారాణి ముఖ ఆకారంలోనే ఉన్న ఒక కప్పుతో తను మంచి నీళ్లు తాగుతూ ఆ వీడియోలో కనిపించింది.

 

ఇంకా ఆ వీడియో గురించి చెబుతూ నాకున్న అలవాట్లలో నా చిన్నతనంలో వాడిన అన్ని రకాల కప్స్ దాచుకునే దాన్నిమరియు ఇతర ఆట వస్తువులు కూడా. 1996లో ఆ సిండ్రిల్లా కప్పు నుండి కొద్దిగా మంచి నీటిని తాగుతూ ఉన్నప్పుడు ఆ వీడియోచిత్రికరించిన ట్లు చెప్పుకొచ్చింది. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నాకాబట్టి ఆ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దానికి ఓ ట్యాగ్లైన్ కూడా ఇచ్చింది అదేంటం "#thewonderyears doodh ka doodh, paani ka paani and my obsession with Cinderella ", సిండ్రిల్లా తో నాకున్న అనుబంధం అనే క్యాప్షన్తో షేర్ చేసింది కొన్ని వారాల క్రితం తన సోదరుడు విశాల్ కు మరో త్రో బ్యాక్ ఫోటో ను కూడా  అంకితం  చేసిన విషయం తెలిసిందే.  కియారా ఇటీవల నెట్‌ఫ్లిక్స్ చిత్రం 'గిల్టీ' లో కనిపించింది. ఆమె తదుపరి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన 'భూల్ భూలైయా 2' లో కనిపిస్తుంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ కూడా నటించారు. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన మరియు విద్యాబాలన్ మరియు షైనీ అహుజాతో అక్షయ్ కుమార్ నటించిన 'భూల్ భూలైయా' 2007 లో విడుదలైంది. ఈ చిత్రం 1993 మలయాళ చిత్రం 'మణిచిత్రాథజు' యొక్క అధికారిక రీమేక్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: