టాలీవుడ్ లోకి వర్షం మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది త్రిష.  మాలీవుడ్ లో తన కెరీర్ మొదలు పెట్టిన త్రిష తెలుగు లో ప్రభాస్ సరసన ‘వర్షం’ మూవీతో మంచి విజయం అందుకుంది.  ఆ తర్వాత తెలుగులోనే ఎక్కువ ఛాన్సులు కొట్టేసింది.. ఈ మాలీవుడ్ బ్యూటీ. చిన్న చిన్ డ్రెస్సులు వేసుకుంటూ హాట్ లుక్ తో కనిపించి ఈ చిన్నది తర్వాత కాలంలో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ వచ్చింది. ఒక దశలో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించింది. కెరీర్ మొదలై పదిహేనేళ్లు దాటినా.. ఇంకా గ్లామర్ మెయింటేన్ చేస్తూ వస్తుంది. త్రిష పర్సనల్ లైఫ్ లో కూడా ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి.  

 

తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో ఈ అమ్మడు నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది. ఈ రెండు భాషల్లోను టాప్ హీరోయిన్ గా ఆమె కొన్నేళ్ల పాటు తన హవాను కొనసాగించింది.  అయితే ఇటీవల కాలంలో కొత్త కథానాయికల పోటీ కారణంగా ఆమె జోరు తగ్గింది. ఆ మద్య ఓ మూవీ విషయంలో కూడా తమిళ సినిమా నిర్మాత మండలి త్రిష పై సీరియస్ అయ్యారు.. కేవలం నటనకు మాత్రమే పరిమితం కావొద్దని.. ప్రమోషన్ వర్క్ లో కూడా ఉండాలని ఆమెకు సూచించారు.  ఈ నేపథ్యంలోనే చిరంజీవితో కొరటాల చేస్తున్న 'ఆచార్య' సినిమాలో కథానాయికగా ఆమెను తీసుకున్నారు. ఆలస్యంగానైనా భారీ ఆఫర్ నే కొట్టేసిందని అంతా అనుకున్నారు.

 

 అంతలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి త్రిష తప్పుకుందన్న వార్తలు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.  అయితే త్రిష ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి రక రకాల కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే.. త్రిష ఇప్పుడు రవితేజ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. రవితేజ - రమేశ్ వర్మ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో ఆమె ఎంపిక జరిగిపోయిందని అంటున్నారు. మెగాస్టార్ కి నో చెప్పి రవితేజకు ఓకే చెప్పడంతో త్రిష నిర్ణయానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: