ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించింది సమీరా రెడ్డి. అప్పట్లో జై చిరంజీవ, అశోక్ మూవీలో నటించింది.. నటించిన రెండు సినిమాలు స్టార్ హీరోలతో కావంతోబాగా పాపులర్ అయ్యింది.  ఆ తర్వతా ఈ అమ్మడిపై కొన్ని రూమర్లు పుట్టుకొచ్చాయి.. టాలీవుడ్ హీరోతో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు తెగ హల్ చల్ చేశాయి.  వాటన్నింటికి చెక్ పెడుతూ.. సమీరా రెడ్డి 2014లో ముంబైకి చెందిన అక్షయ్ అనే వ్యాపార వేత్తని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత సమీరారెడ్డి సినిమాలకు పూర్తిగా దూరమైంది.  ఇక సినిమాలకు దూరంగా ఉన్నా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. కొన్ని సార్లు నెటిజన్లు ట్రోలింగ్ కూడా చేస్తుంటారు.  

 

ఆ సమయంలో నెజిజ‌న్ల కామెంట్ల‌కు గ‌ట్టిగానే జవాబులు ఇస్తా ఉంటది.  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సినీ సెలబ్రెటీలు అంతా ఇంటి పట్టున ఉంటున్నారు తాజాగా కుటుంబంతో బిజీగా ఉండే స‌మీరా భర్త ఇటీవ‌ల‌ అక్షయ్ వర్దేతో ఫ‌న్నీ గేమ్ ఆడింది. ఈ గేమ్ రూల్స్ ఏంటంటే.. ఇద్ద‌రు క‌ళ్లు మూసుకోవాలి. ఎదురుగా ఒక‌రు ఆస‌క్తిక‌ర‌మైన‌ ప్ర‌శ్న‌లు అడుగుతుంటారు. ఆ మాట క‌రెక్టుగా ఎవ‌రికి వ‌ర్తిస్తుందో వారు చేతితో  చూపించాలి.

 

అయితే ఈ గేమ్ లో భార్యాభర్తలు ఇద్దరూ సూపర్ గా ఆడారు.. కాకపోతే ఎవ‌రు ఎవ‌రికి ఎన్ని ఓట్లు వేశారో వీడియో చూసి తెలుసుకోవాల్సిందే..  అయితే ఈ జంట ఆడుతున్న సమయంలో వారి హావభావాలు ఎదుటి వారు చూడాల్సిందే. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  ఏది ఏమైనా లాక్ డౌన్ వల్ల చాలా కాలం తర్వాత సెలబ్రెటీలు తమ కుటుంబ సభ్యులతో చాలా హ్యాపీగా గడుపుతున్నారు.  టాలీవుడ్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఛాలెంజ్ లు విసురుకుంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: