టాలీవుడ్ లో ఎంతో మంది బాలీవుడ్ భామలు తమ అందాలతో కుర్రాళ్ల మనసు దోచేశారు. చాలా కొద్ది మంది మాత్రమే స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కొంత కాలంగా రకూల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు పూజా హగ్డే మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు.  ఇక  చిన్నారి పెళ్లికూతురిగా తెలుగు వారికి పరిచయమైన అవికాగోర్... చిన్నప్పుడే స్టార్ డమ్ సంపాదించుకుంది. ‘చిన్నారి పెళ్లి కూతురు’ అనే డబ్బింగ్ సీరియల్‌తో తెలుగునాట బుల్లితెర ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన అవిక ఆ తర్వాత వెండితెరపైనా ఓ వెలుగు వెలిగింది.  ఈ అమ్మడు రాజ్ తరుణ్ నటించిన ‘ఉయ్యాల జంపాల’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.  

 

ఆ తర్వాత రాజ్ తరుణ్ నటించిన సినిమా చూపిస్త మావా, లక్ష్మి రావే మాఇంటికి, ఎక్కడికి పోతావు చిన్నవాడ మంచి విజయాలు అందుకుంది.  ఓంకార్ దర్శకత్వంలో ‘రాజు గారిగది 3’ లాంటి హర్రర్ మూవీలో నటించింది. మొదటి నుంచి చాలా ట్రెడిషన్ గా ఉంటూ వచ్చింది అవికా గోర్... మొదట్లో కాస్త బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ తర్వాత ఫిట్ నెస్ పై దృష్టి పెట్టి గ్లామర్ డోస్ పెంచుతూ వచ్చింది.  చాలా కష్టపడి తన బొద్దు అవతారాన్ని మార్చి స్లిమ్‌గా తయారైంది.

 

తాజాగా ఈ భామ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  తనకు ‘ట్రోలింగ్’ కూడా ఉపయోగపడిందని చెబుతోంది అవికా గోర్. తన గ్లామర్ గురించి చాలా ట్రోల్స్ చూశాననీ… ఈ నేపథ్యంలోనే తనను తాను పూర్తిగా మార్చేసుకోవాలనుకున్నానని అవికా గోర్ పేర్కొంది. ఈ నేపథ్యంలో తన గ్లామర్‌ను చూపిస్తూ సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా దర్శనమిస్తోంది అవికా గోర్. అయితే కరోనా లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉంటున్న తాను డ్యాన్స్ ప్రాక్టీస్, స్విమ్మింగ్ చేస్తూ సన్నబడ్డానని పేర్కొంది. తెలుగు లో మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: