దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో సెలబ్రిటీలు తమ వంతు సాయం చేస్తున్నారు. కొందరు కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటూ లక్షలు ఇవ్వడానికి వెనుకడుగు వేస్తుంటే.... మరికొందరు తక్కువ మొత్తంలో పారితోషికం అందుకుంటున్నా తమ గొప్ప మనస్సును చాటుకుంటున్నారు. తాజాగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ట్విట్టర్ ద్వారా కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ నిధికి, పలు సంస్థలకు విరాళాలు ఇవ్వనున్నట్టు పకటించారు. 
 
పీఎం కేర్స్ ఫండ్, వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్, కరోనా క్రైసిస్ ఛారిటీ, సీఎం రిలీఫ్ ఫండ్, స్పూర్తి సంక్షేమ సేవా సంఘాలకు సహాయం చేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా కట్టడి కోసం తాను ఈ సహాయం చేస్తున్నట్టు పేర్కొంది. ప్రపంచమంతా కరోనా వల్ల భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటోందని... అభిమానులు కూడా సాయం చేయాలని ఇస్మార్ట్ బ్యూటీ పిలుపునిచ్చింది. ఇస్మార్ట్ బ్యూటీ గొప్ప మనస్సును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 
 
కరోనా కట్టడికి తాను సాయం చేయడమే కాకుండా అభిమానులకు, ఇతరులకు సాయం చేయాలని పిలుపునిచ్చి కరోనా కట్టడికి కొండంత సాయం చేసిందని నిధిని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు నిధి చేసిన ట్వీట్ ను రీట్వీట్లు చేస్తూ లైకులు, కామెంట్ల రూపంలో అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ ఇస్మార్ట్ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 
 
ఈరోజు సీనియర్ హీరో రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక 2 లక్షల రూపాయల చెక్కు మంత్రి కేటీఆర్ కు అందజేశారు. గతంలో కరోనా క్రైసిస్ ఛారిటీకి 2 లక్షలు ఇచ్చిన శివానీ, శివాత్మిక తాజాగా మరోసారి 2 లక్షల రూపాయల సాయం చేసి గొప్ప మనస్సు చాటుకున్నారు. కొందరు స్టార్ హీరోయిన్ల కంటే చిన్న హీరోయిన్లే ఎక్కువ మొత్తంలో సాయం చేయడంతో స్టార్ హీరోయిన్లకు ఇదేం కకృత్తి అని కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: