ప్రస్తుతం యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, వకీల్ సాబ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తి అయింది. వాస్తవానికి ఈ సినిమాని మే నెల రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. అయితే అర్ధాంతరంగా ఈ మహమ్మారి కరోనా వలన లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో షూటింగ్స్ అన్ని కూడా నిలుపుదల చేయడంతో వకీల్ సాబ్ కూడా ఆగిపోయింది. ఇక ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక పీరియాడికల్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

 

ఇటీవల రెండు భారీ షెడ్యూల్స్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ సినిమాని శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎమ్ రత్నం ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక వజ్రాల దొంగగా నటిస్తున్నారని, అలానే కోహినూర్ వజ్రం దొంగతనం నేపథ్యంలో మొఘలాయుల కాలం నాటి కథగా ఈ సినిమా రూపొందుతోందని అంటున్నారు. పలువురు దిగ్గజ నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో శివగామి రమ్యకృష్ణ ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నట్లు లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో టాక్. 

 

వాస్తవానికి ముందుగా ఆ పాత్ర కోసం వేరొక నటిని తీసుకోవాలని భావించారని, అయితే గతంలో బాహుబలి రెండు భాగాల్లో శివగామి పాత్రలో అత్యద్భుత నటనను కనబరిచి ప్రేక్షకుల మదిని దోచిన రమ్యకృష్ణ అయితేనే బాగుంటుందని భావించిన దర్శకుడు క్రిష్, ఇటీవల ఆమెకు కథను, ఆమె పాత్రను విన్పించడం, అది ఆమెకు ఎంతో నచ్చడంతో రమ్యకృష్ణ కూడా చేయడానికి ఒప్పుకున్నారని అంటున్నారు. కాగా ఈ సినిమాలో ఆమె పాత్ర ఎంతో అదిరిపోనుందని, తప్పకుండా కెరీర్ పరంగా రమ్యకృష్ణ కు మంచి గుర్తింపునిచ్చే పాత్ర అదని అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై ఆ సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: