సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం "ఉప్పెన". మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కరోనా వైరస్ లేకుంటే ఈ పాటికి రిలీజ్ అయ్యుండేది. దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

 

నీ కన్ను నీలి సముద్రం అనే పాటకి యూట్యూబ్ లో మిలియన్స్ లో వ్యూస్ వచ్చాయి. ఈ పాటతీ దేవిశ్రీ ప్రసాద్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడని అర్థమైంది. అయితే ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఉప్పెనలో విజయ్ సేతుపతి పాత్ర చాలా బాగుంటుందట. ఆ పాత్ర తాలూకు స్వభావం నచ్చే విజయ్ సేతుపతిసినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.

 

 

అయితే ఈ సినిమా ఇంకా తెలుగులో రిలీజ్ అవ్వకముందే తమిళంలో రీమేక్ కి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్క్రిప్టు మీద ఉన్న నమ్మకంతో విజయ్ సేతుపతి ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నాడట. అయితే ఆల్రెడీ ఈ కథని తమిళ నటుడు విజయ్ కి వినిపించాడట. కథ విని ఇంప్రెస్ అయిన విజయ్సినిమా ద్వారా తన కొడుకు జేసన్ సంజయ్ ని తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేద్దాం అనుకుంటున్నాడట.

 


సంజయ్ ప్రస్తుతం కెనడాలో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుంటున్నాడు. మరి కొద్దిరోజులో అది పూర్తి చేసుకుని రాగానే ఉప్పెన రీమేక్ ద్వారా తన కొడుకుని లాంచ్ చేస్తాడట. మరి సినిమా రిలీజ్ కాకముందే ఇంతగా ఇంప్రెస్ అవుతున్న దాన్ని బట్టి చూస్తుంటే, ఉప్పెన సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఆ అంచనాలని ఉప్పెన అందుకుంటుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: