నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో చాలా సినిమాలు వచ్చాయి. కాగా వారిద్దరి కాంబోలో 2001లో వచ్చిన సూపర్ డూపర్ సెన్సేషనల్ హిట్ సినిమా నరసింహనాయుడు. బాలకృష్ణ సరసన సిమ్రాన్, ప్రీతి జింగ్యాని హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కథ, కథనాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఎంతో అత్యద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు గోపాల్. 

 

అప్పట్లో అతిపెద్ద సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమా గుంటూరులోని కృష్ణ మహల్ థియేటర్ లో వంద రోజుల పాటు ఏకంగా నాలుగు షోలు హౌస్ఫుల్ అయి సరికొత్త సెన్సేషనల్ రికార్డును సృష్టించింది. ఇక ఈ సినిమాలో పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్, ఫైట్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, వండర్ఫుల్ విజువల్స్ తో పాటు బాలయ్య పలికిన డైలాగ్స్ కూడా సినిమా సక్సెస్ కు ప్రధానం కారణంగా నిలిచాయి. మొదటి నుండి డైలాగ్స్ పలకడంలో తనకంటూ టాలీవుడ్ లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బాలయ్య. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ పలికిన డైలాగ్స్ చాలావరకు ఎంతో పవర్ఫుల్ గా ఉంటాయి అనే చెప్పాలి. 

 

కాగా వాటిలో ముఖ్యంగా 'ఇలా చెయ్యి లేపే మీ బావ గొయ్యిలో పడుకున్నాడు' 'కత్తులతో కాదురా కంటిచూపుతో చంపేస్తా' అంటూ బాలయ్య పలికిన అడిగిపోయే డైలాగ్స్ తో అప్పట్లో థియేటర్స్ దద్దరిల్లిపోయాయనే చెప్పాలి. ఇక ఇప్పటికీ కూడా ఈ సినిమాకి, అలానే సినిమా సాంగ్స్, డైలాగ్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా సినిమాలో కీలకమైన ట్రైన్ ఎపిసోడ్ లో బాలయ్య నటన నభూతో నభవిష్యతి అనే చెప్పాలి. అలానే బాలయ్య బి.గోపాల్ ల కాంబినేషన్ లో గతంలో వచ్చిన సమరసింహారెడ్డి సినిమా కూడా గొప్ప విజయాన్ని అందుకున్నప్పటికీ కూడా దానికంటే కూడా మరింత గొప్ప విజయాన్ని అందుకుని, పలు అత్యద్భుత రికార్డ్స్ ని కొల్లగొట్టిన నరసింహనాయుడు ఒక ప్రత్యేకమైన సినిమా అని చెప్పుకోవాలి.....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: