టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమాలోనే రజనీ కాంత్ నటించిన నరసింహా, బాషా సినిమాలు బాగా హిట్ అయ్యాయి. ఈ సినిమాల్లో ఉండే కొన్ని డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అనే చెప్పవచ్చు. ఈ సినిమాల్లో ఉండే ప్రతీ సీన్... ప్రతీ డైలాగ్ కూడా ప్రేక్షకులను మెప్పించింది అనే చెప్పవచ్చు. నరసింహా సినిమాలో రజని కాంత్ నోటి నుంచ వచ్చే కొన్ని డైలాగ్స్ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. నా దారి రహదారి అంటూ రజని కాంత్ నరసింహా సినిమాలో చెప్పిన డైలాగ్ ఇప్పటికి జనాలు వాడుకుంటారు అనేది వాస్తవం. 

 

ఇక బాషా సినిమా విషయానికి వస్తే ఆ సినిమాలో రజని చెప్పిన కొన్ని డైలాగ్స్ కి ఇప్పటికి ఫాన్స్ కి నచ్చుతూనే ఉంటాయి. ఈ బాషా ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు అంటూ చెప్పిన డైలాగ్ బాగా ఆకట్టుకుంది ప్రేక్షకులను. ఈ సినిమా తర్వాత రజనీ కాంత్ రేంజ్ కూడా బాగా పెరిగింది అనే చెప్పవచ్చు. నరసింహా సినిమాలో డైలాగ్స్ కి బాలీవుడ్ కూడా ఫిదా అయిపోయింది. అక్కడి నుంచి రజని కాంత్ కి తెలుగులో కూడా ఫాన్స్ బాగా పెరిగారు. ఈ సినిమా ఇప్పుడు వచ్చినా సరే ప్రేక్షకులు టీవీ ల ముందు కూర్చుని చూస్తూ ఉంటారు. 

 

ఆ విధంగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది అనేది అర్ధమవుతుంది. ఇక ఇదిలా ఉంటే రజని సినిమాల్లో డైలాగ్స్ రాయడానికి అప్పటి నుంచి రచయిత లు పోటీ పడ్డారు అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అక్కడి నుంచి రజని సినిమాలకు రేట్ కూడా బాగా పెంచాడని చెప్తూ ఉంటారు. బాషా సినిమాలో రజని చెప్పిన కొన్ని డైలాగ్స్ చూసి రజని కంటే పాపులర్ అయిన హీరోలు కూడా షాక్ అయ్యారు అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: