బాలకృష్ణ పూరి జగన్నాథ్ సినిమా రావాలని నందమూరి అభిమానులు ఎంత కాలమో ఎదురు చూసారు. ఇద్దరు కూడా హైపర్ కావడం తో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడగా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా పైసా వసూల్. ఈ సినిమా వసూళ్లు అంతగా లేకపోయినా కొందరికి అంతగా నచ్చకపోయినా సరే సినిమా మాత్రం మంచి విజయం సాధించింది. విమర్శకుల ప్రసంశలు అందుకుంది ఈ చిత్రం. ప్రధానంగా బాలకృష్ణ నటనకు ఎందరో అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ లో బాలకృష్ణ కెరీర్ లో ఈ సినిమా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. 

 

బాలకృష్ణ కు అప్పుడు దాదాపుగా 60 ఏళ్ళు ఉంటాయి అయినా సరే ఎక్కడా కూడా పూరి రేంజ్ ని తగ్గించకుండా ఆయన నటించారు. పూరి మార్క్ ని సినిమాలో కచ్చితంగా చూపించారు బాలకృష్ణ. ప్రతీ సీన్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇక ఈ సినిమాలో ఉండే  కొన్ని డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పవచ్చు. ప్రధానంగా చెప్పుకునే డైలాగ్ ఒకటి ఉంటుంది. తమ్ముడు నేను జంగిల్ బుక్ సినిమా చూడాలా అందులో పులి అచ్చం నాలాగే ఉంటుంది అని చాలా మంది చెప్పారు అంటూ బాలకృష్ణ అంటారు. 

 

అలాగే ఆ సినిమాలో కొన్ని డైలాగులు ఎంతగానో ఆకట్టుకున్నాయి ప్రేక్షకులను. ప్రతీ సీన్ కూడా బాగా నచ్చింది. అదే విధంగా ఆ సినిమాలో... కొన్ని డైలాగులు, ఒక పాట ఇప్పటికీ హైలెట్ గానే ఉంటాయి. విలన్ టచడ్ మై హీరోయిన్ అంటూ బాలకృష్ణ ఒక చిన్న డైలాగ్ చెప్తారు. ఇది కూడా బాగానే ఆకట్టుకుంది ప్రేక్షకులను. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ పూరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తుంది అని భావించారు. కాని అది ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుంది అనేది కూడా స్పష్టత లేదు బాలకృష్ణ అభిమానులకు.

మరింత సమాచారం తెలుసుకోండి: